Sunday, 20 April 2025 03:28:24 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆరోగ్యశ్రీపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం నమ్మొద్దు: ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్

Date : 02 August 2024 02:01 PM Views : 149

Studio18 News - ANDHRA PRADESH / : satya kumar yadav on aarogyasri: ఆరోగ్యశ్రీ పథకంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో శుక్రవారం అవయవదానంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..” రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 45 రోజులే అయింది. అప్పుడే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తీసేస్తారని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది.. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆస్పత్రులకు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. సొంత ఊరులో మాజీ సీఎం మెడికల్ కాలేజీకి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు.. ఇది మీ పరిస్థితి. మొన్ననే లోకేశ్ జగన్ మోహన్ రెడ్డి కాదని లేవన్ మోహన్ రెడ్డి అన్నారు. తరువాత జీరో జగన్ మోహన్ రెడ్డి అంటార”ని ఎద్దేవా చేశారు. తాను కూడా అవయవదానం చేయనున్నట్టు మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. ”అవయవదానం చేసిన వారికి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. అవయవదానం చాలా ముఖ్యమైనది. ప్రాణం పోసేవాడు దేవుడు.. ప్రాణం నిలిపేవాడు డాక్టర్. అవయవదానం చేసేందుకు గొప్ప మనస్సు ఉండాలి. అవయవదానం చేయడానికి అందరూ ముందుకు రావాలి. అవయవాలు దానం చేసేవారు చనిపోయినా బతికే ఉంటారు. తెలంగాణలో 8 ఏళ్లలో 800 మంది ముందుకు వచ్చారు. ఏపీలో అవయవదానం చేసేవారు తక్కువ మంది ఉన్నారు. దేశంలో 90 వేల మంది అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దేశ వ్యాప్తంగా 5 లక్షలు మంది అవయవాలు లేక చనిపోతున్నారు. అవయవదానం చేసేందుకు మతాలు అడ్డువస్తున్నాయని అంటున్నారు. ప్రతిమనిషి దేవుడితో సమానం. అవయవదానం చేస్తే.. పైన ఉన్న దేవతలు కూడా ఆశీర్వదిస్తారు. అవయవదానం చేసేందుకు ఐపీఎస్, ఐఏఎస్, ఇతర ఉన్నత అధికారులు కూడా ముందుకు రావాలి. అలా చేయడం వల్ల ప్రతిఒక్కరూ ముందుకువచ్చే అవకాశం ఉంది. అవయవదానాన్ని ప్రోత్సహించేలా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయాలి. అంతే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకుల ద్వారా అవగాహన కల్పించాల”ని మంత్రి సత్య కుమార్ యాదవ్ సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :