Saturday, 26 April 2025 07:15:30 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

భారీ స్పందన.. ఏపీ సీఎం సహాయ నిధికి ఎన్నివందల కోట్ల విరాళాలొచ్చాయో తెలుసా?

Date : 25 September 2024 03:28 PM Views : 71

Studio18 News - ANDHRA PRADESH / : AP CM Relief Fund : ఏపీలో ఇటీవల భారీ వర్షాలకుతోడు, బుడమేరు నీరు పోటెత్తడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ కార్యాలయంలోనే మకాంవేసి.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడంతోపాటు.. తానే స్వయంగా ముంపు ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్లి బాధితులకు భరోసానిచ్చారు. అంతేకాక.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. దాదాపు నాలుగైదు రోజుల పాటు ప్రజలు ముంపులోనే ఉన్నారు. ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయసహకారాలు అందించింది. వరదల బాధితుల సహాయంకోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వెల్లువెత్తాయి. సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు తెలిపారు. విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు.. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముదుకొచ్చారని అభినందించారు. ఇప్పటి వరకు సీఎం సహాయ నిధికి రూ. 400 కోట్లు వచ్చాయని.. ఇంత పెద్దమొత్తంలో విరాళాలు రావడం ఒక చరిత్ర అని చంద్రబాబు అన్నారు. చిన్నా పెద్దా అందరూ స్పందించి విరాళాలు అందజేయడం మంచి పరిణామం, విరాళాలు ఇచ్చిన వారందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రూ. 602 కోట్లు ఇప్పటి వరకు బాధితులకు విడుదల చేశామని.. ఇందులో రూ. 400 కోట్లు దాతలు ఇచ్చినవేనని అన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 16 జిల్లాల్లో మొత్తం రూ. 6,800 కోట్లు నష్టం జరిగిందని చంద్రబాబు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :