Monday, 28 April 2025 06:05:23 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు.. పూర్తి వివరాలు వెల్లడించిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్

Date : 10 August 2024 06:00 PM Views : 162

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్ కొత్త రైల్వే ప్రాజెక్టు వివరాలను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హౌరా-చెన్నై రైల్వే కారిడార్ అనేక రాష్ట్రాలను కలుపుతుందని తెలిపారు. ఈ కారిడార్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించామని, విజయనగరం వరకు 3వ లైన్ నిర్మాణం ఆమోదం పొందిందని చెప్పారు. మొత్తంగా 4 లైన్ల కారిడార్ నిర్మించాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. అసన్‌సోల్ (బెంగాల్) – వరంగల్ వరకు కలిపేలా సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జునాగఢ్ – నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి – పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వై లైన్లు ఈ కారిడార్లో భాగంగా ఉంటాయని తెలిపారు. రూ.7,383 కోట్ల ఈ రెండు ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేయడంలో ఈ కారిడార్లు చాలా ఉపయోగకరంగా మారతాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బొగ్గును నేరుగా తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు చేరుకుంటుందని చెప్పారు. ఈ కారిడార్ ద్వారా 500-700 కి.మీ దూరం తగ్గుతుందని తెలిపారు. తెలంగాణలో 19.7, ఏపీలో 85.5 కి.మీ దూరం ఈ ప్రాజెక్టులో కవర్ అవుతోందని చెప్పారు. గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జితో పాటుగా ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగనుందని తెలిపారు. కోస్తా ఏరియాలో తుఫాన్లు ఏర్పడినప్పుడు ఈ కారిడార్ సరకు రవాణాకు కీలకంగా మారుతుందని అన్నారు.మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం మీదుగా ఈ లైన్ సాగుతుందని చెప్పారు. ఆ ప్రాంతం అభివృద్ధికి ఈ మార్గం కీలకంగా మారనుందని తెలిపారు. ఈ మార్గంలో టన్నెల్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్‌పై సీఎంతో మాట్లాడానని తెలిపారు. తమకు కేటాయించిన స్థలం నీరు నిలిచే ప్రాంతమని, కొత్తగా వేరే భూమి ఇవ్వాలని కోరామని, ఆ ఏర్పాట్లలో రాష్ట్రం ఉందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :