Wednesday, 30 April 2025 03:28:17 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన

కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన పవన్, లోకేశ్ ల మధ్య సమన్వయ లోపం ఉందంటూ భూమన విమర్శలు కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరో తేల్చాలని డిమాండ్

Date : 17 March 2025 02:28 PM Views : 42

Studio18 News - ANDHRA PRADESH / : రాష్ట్రంలో కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతల వెనుక ఉన్న దుష్ట శక్తులను వెలికి తీయాలని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు సమస్యల్లో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేయడం అంటే హిందూ ధర్మం గుండెపై బుల్డోజర్లతో దాడి చేయడమేనని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. అటవీ శాఖ పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పనిచేస్తుండగా, అటవీశాఖ అధికారులే కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టారని వెల్లడించారు. మరి, సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే పవనానంద స్వామి వారి గొంతుక ఇప్పుడెందుకు మూగబోయిందని భూమన నిలదీశారు. గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన పవన్, ఇప్పుడు కాశినాయన క్షేత్రం విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పైగా, మంత్రి నారా లోకేశ్ క్షమాపణ చెప్పడం, ఆయనే క్షేత్రాన్ని పునర్ నిర్మిస్తానని చెప్పడం వారి మధ్య వైరుధ్యాలకు నిదర్శనమని భూమన అన్నారు. సోషల్ మీడియాలో వీరి మధ్య ఉన్న విభేదాలు బహిరంగ రహస్యమేనని ఆయన గుర్తు చేశారు. గతంలో ఆలయాలను కూల్చిన వారే ఇప్పుడు కాశీనాయన క్షేత్రంపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. టైగర్ జోన్ పరిధిలో ఉందని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం చూస్తుంటే శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారేమోనని అనుమానం కలుగుతోందని భూమన అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్షేత్రాన్ని అటవీ చట్టాల నుంచి మినహాయించాలని కేంద్రానికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ఆదేశాలు లేకుండానే కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కూడా ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. కూటమి పాలనలో హిందూ ధర్మానికి గడ్డుకాలం వచ్చిందని, వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడమే వారికి తెలుసని భూమన విమర్శించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :