Wednesday, 25 June 2025 07:47:12 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Kuppam: సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కుప్పం వైసీపీ నేతలు

Date : 31 July 2024 03:36 PM Views : 144

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం వైసీపీ నేతలు నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీకి తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పిన చంద్రబాబు టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన కుప్పం నేతలు మాట్లాడుతూ, కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. వైనాట్ 175 అన్నారు... కుప్పంలో రౌడీయిజాన్ని పెంచి పోషించారు.... కుప్పంను సర్వనాశనం చేశారు అంటూ వారు ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు కారణంగా ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చిందని వివరించారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ, త్వరలోనే మరికొందరు కుప్పం వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరుతున్నారని వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :