Sunday, 08 March 2026 03:28:25 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Chandrababu: విజయవాడ వరదల వల్ల పాడైన వాహనాల యజమానులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్!

Date : 09 September 2024 02:43 PM Views : 408

Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడ వాసులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వరదల్లో దెబ్బతిన్న, మునిగి పాడైన వాహనాల మరమ్మతులకు అయ్యే ఖర్చులో కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పాడైన ఇంట్లోని ఉపకరణాల ఖర్చులోనూ కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాదిమందికి లబ్ధి జరగనుంది. గత రాత్రి విజయవాడ కలెక్టరేట్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వాహన కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు వరదల కారణంగా బైక్‌లు, ఆటోలు, కార్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వీటిలో కొన్నింటికి బీమా ఉండగా, బీమా లేని వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అసలు వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఇది అదనపు ఖర్చు కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ముందుకొచ్చి మరమ్మతులు చేయించి ఇవ్వాలని నిర్ణయించింది. రిపేరుకు తక్కువ మొత్తం అయితే ప్రభుత్వమే భరించాలని, ఎక్కువ అయితే మాత్రం కొంత వాటి యజమానులు కూడా భరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరమ్మతు పనుల కోసం ఆయా వాహన తయారీదారులతో సంప్రదింపులు జరుపుతోంది. అలాగే, వారి వద్ద సీఎస్ఆర్ నిధులు ఉంటాయి కాబట్టి వాటితో ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వాలని కోరుతోంది. అర్బన్ కంపెనీకి పనులు వరదల కారణంగా దెబ్బతిన్న ఇంట్లోని ఎలక్ట్రిక్, ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్‌కు సంబంధించిన మరమ్మతు పనులను ‘అర్బన్ కంపెనీ’కి అప్పగిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వస్తుందని, అనంతరం కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే, నష్టపోయిన వ్యాపారుల విషయంలోనూ బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :