Saturday, 26 April 2025 07:22:55 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Daggubati Purandeswari: ఎన్టీఆర్ మ్యూజియంను ఏర్పాటు చేయాలని చంద్రబాబును కోరాం: పురందేశ్వరి

Date : 15 August 2024 04:32 PM Views : 79

Studio18 News - ANDHRA PRADESH / : ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి, మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఆనాడు దాదాపు 40 కోట్ల మంది దేశ ప్రజలు స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారని చెప్పారు. ఇప్పుడు దేశ జనాభా 144 కోట్లకు చేరుకుందని... దేశ ఐక్యతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని చెప్పారు. గుంటూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని పురందేశ్వరి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, 2040 నాటికి వికసిత భారత్ ను చూడాలనేది మోదీ లక్ష్యమని... వికసిత ఏపీ కోసం అందరం కలిసి పని చేద్దామని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని పురందేశ్వరి చెప్పారు. కూటమికి రాష్ట్ర ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరం కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం 'వారధి' అనే కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభించిందని పురందేశ్వరి చెప్పారు. ఈరోజు నుంచి అన్ని బీజేపీ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించి, వాటి వివరాలను ఒక యాప్ లో కూడా పెడతామని చెప్పారు. అందరం ప్రజా సేవకులుగా పని చేద్దామని... బాధితుల కన్నీరు తుడుద్దామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మ్యూజియంను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరామని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :