Sunday, 20 April 2025 03:01:29 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TTD: రమణదీక్షితుల కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Date : 02 August 2024 01:38 PM Views : 84

Studio18 News - ANDHRA PRADESH / : ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గత ప్రభుత్వం తనను టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి తప్పించిందని, తిరిగి ఆ బాధ్యతలు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రమణదీక్షితులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు కోర్టు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అసలేం జరిగిందంటే? టీటీడీలో వంశపారంపర్యంగా అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పదవీ విరమణ వర్తింపజేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రమణ దీక్షితులతో పాటు మరి కొందరు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే, వయోభారంతో స్వామివారి కైంకర్య సేవలు సక్రమంగా నిర్వర్తించలేరన్న కారణంతో రమణ దీక్షితులను టీటీడీ విధుల్లోకి తీసుకోలేదు. అయితే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రమణ దీక్షితులను ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించింది. టీటీడీ నోటీసులు టీటీడీలో గౌరవ ప్రధాన అర్చకుడిగా తిరిగి నియమితులైన రమణ దీక్షితులు టీటీడీ పాలకమండలి, అధికారులు, సీనియర్, జూనియర్ పీఠాధిపతులపైనా, నాటి సీఎం జగన్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో టీటీడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలో రమణదీక్షితులను తొలగిస్తూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీ ఈవో సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా వ్యవహరించారని, ఈవో ఉత్తర్వులను రద్దు చేసి తిరిగి గౌరవ ప్రధాన అర్చకుడి బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం, టీటీడీకి నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలు వాయిదా వేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :