Wednesday, 16 July 2025 10:56:23 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఏపీ వ్యాప్తంగా వర్షాలు.. జనసేన శ్రేణులకు నాగబాబు కీలక సూచనలు

Date : 20 July 2024 04:40 PM Views : 158

Studio18 News - ANDHRA PRADESH / : anasena Leader NagaBabu : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాతోపాటు శ్రీకాకుళం, విశాఖపట్టణం, పార్వతీపురం మన్యం, ఉమ్మడి విజయనగరం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీనికితోడు నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వరదనీటిలో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పార్టీ శ్రేణులకు కీలక సూచన చేశారు.రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు.. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమై సహాయక చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటూ సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని జనసేన నాయకులు, కార్యకర్తలను నాగబాబు కోరారు. తాగునీరు, ఔషదాలు, ఆహారం అందించాలని సూచించారు.మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంలోను, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించడంలోనూ తోడ్పాటు ఇవ్వాలని జనసేన నేతలు, కార్యకర్తలకు నాగబాబు విజ్ఞప్తి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :