Thursday, 22 May 2025 04:17:09 PM
# నటి అనసూయ ఇంట్లో మరో వేడుక # 53 లక్షల చ.అ. విస్తీర్ణంతో సచివాలయం అవసరమా?: జగన్ # కారు వెనుక నక్కి సల్మాన్ ఖాన్ ఇంట్లోకి దూరే యత్నం.. వ్యక్తి అరెస్టు # రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే...! # ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు?

Dowleswaram Barrage : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్ల మధ్యలో ఇరుక్కుపోయిన బోటు.. వీడియో వైరల్

Date : 21 July 2024 12:34 PM Views : 213

Studio18 News - ANDHRA PRADESH / : Dowleswaram Barrage : తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకుతోడు, ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10.2 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుంది. బ్యారేజ్ నుంచి 5లక్షల9వేల క్యూసెక్కుల మిగులు జలాలను బ్యారేజ్ కు చెందిన 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు. అయితే, దవళేశ్వరం బ్యారేజ్ వద్ద బోటు ఇరుక్కుపోయింది.దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఈ ఘటన జరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకుపోయింది. బ్యారేజ్ వద్ద గేట్ల మధ్య బోటు ఇరుక్కుపోయింది. బోటును బయటకు తీసేందుకు ఇరిగేషన్ సిబ్బంది, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో బోటును బయటకు తీయడం కష్టతరంగా మారుతుంది.ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేవీపట్నం మండలం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉధృతంగా గోదావరి నీటిమట్టం పెరిగిపోతోంది. దీంతో గండి పోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీటమునిగింది. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో రాకపోకలు స్తంభించాయి. వరద ఉద్ధృతితో జాతీయ రహదారి 326 కోతకు గురైంది. జాతీయ రహదారిపై వరద చేరికతో ఒడిశా – ఆంధ్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉద్ధృతి కారణంగా భద్రాచలం – చింతూరు, కూనవరం – భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :