Monday, 15 December 2025 12:57:25 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

Vijayawada: వరద బాధితుడిపై చేయి చేసుకున్న వీఆర్ఓ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Date : 10 September 2024 12:27 PM Views : 207

Studio18 News - ANDHRA PRADESH / : వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఉద్యోగులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నా కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా, దురుసుగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. వరద బాధితుడి పట్ల దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్న ఓ వీఆర్ఓపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విషయంలోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ 58వ డివిజన్ షాదీఖానా వద్ద సోమవారం వరద బాధితులకు పోలీసుల సమక్షంలో ఎండీయూ వాహనం ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిత్యావసర వస్తువుల పంపిణీ పర్యవేక్షిస్తున్న వీఆర్ఓ విజయలక్ష్మి పని తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వచ్చినప్పటి నుండి తమ వీధిలో ఆహారం, మంచినీరు అందలేదని విఆర్ఓను ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో సహనం కోల్పోయిన వీఆర్ఓ .. వరద బాధితులను దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఎండీ యాసిన్ అనే యువకుడిపై చేయి చేసుకున్నారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను దూరంగా పంపించి వేశారు. వరద బాధితులు పలువురు ఆమెను నిలదీయడాన్ని వీడియో తీసి జరిగిన ఘటనపై వీఆర్ఓ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో వరద బాధితుడిపై వీఆర్ఓ చేయి చేసుకున్న ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, సదరు వీఆర్ఓ తీరుపై బాధితులు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందిస్తూ.. వీఆర్ఓ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. జరిగిన ఘటనకు రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. వరద బాధితుల పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినా, బాధ్యతా రాహితంగా వ్యవహరించినా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :