Thursday, 12 March 2026 12:08:53 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ

Date : 04 August 2024 11:54 AM Views : 519

Studio18 News - ANDHRA PRADESH / : శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ జలాశయం నిండుకుండగా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్కులకుపైగా విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు తీసున్నది. నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా మారిపోతున్నది. దీంతో సాగర్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలు ఇలా.. ఈ ఉదయం 7 గంటలకు శ్రీశైలం జలాశయానికి 4,06,236 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో 5,50,731 క్యూసెక్కులగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.2 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 అడుగులు కాగా, ప్రస్తుతం 200.2 అడుగులు (92.77శాతం) గా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. నాగార్జున సాగర్ విషయానికి వస్తే ఉదయం 9 గంటల సమయానికి నీటి మట్టం 572.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 263.35 (84.39) టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 3,14,409 క్యుసెక్కులుగా నమోదైంది. 35,409 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 19 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంటే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఇన్ ఫ్లో ఇదే విధంగా కొనసాగితే రేపు సాయంత్రానికి సాగర్ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ముందుగా కొంత మేర క్రస్ట్ గేట్లు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :