Tuesday, 18 March 2025 12:14:25 AM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

నాపై ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్

Date : 30 August 2024 02:33 PM Views : 63

Studio18 News - ANDHRA PRADESH / : Pilli Subhash Chandra Bose : తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖండించారు. మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో కలిసి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ మారడం లేదని ఎన్నిసార్లు చెప్పినా తనపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని వాపోయారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తప్ప తమ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చెయ్యడం లేదని తెలిపారు. ”నేను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.. వాస్తవం కాదు. మా రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చెయ్యడం లేదు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచి నేను జగన్ వెంట ఉన్నాను. మంత్రి పదవి వుండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచాను. నాపై ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పార్టీ మారడం లేదని చాలా సార్లు చెప్పాను, అయినా ఇలా చేస్తున్నారు.. బాధేస్తుంది. 2019లో ఓటమి పాలయినా జగన్ నాకు మంత్రి పదవి ఇచ్చారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే మనిషిని నేను కాదు. ఆర్థికంగా నేను సంపన్నున్ని కాదు. విధేయతతో మాత్రం సంపన్నుడిని. నాపై ఏమైనా అనుమానం ఉంటే మీడియా నన్ను అడగండి.. మీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయిద్దు. నిన్న రాజీనామా చేసిన వాళ్ళకి పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది. రాజకీయాల్లో నైతికత ఉండాలి.. పార్టీకి ఉన్న పదవిని కోల్పోయేలా చెయ్యడం పార్టీకి వెన్నుపోటు పొడవడమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవికి రాజీనామా అంటే పార్టీని హత్య చెయ్యడమే. రాజీనామా చేసి వెళ్తున్నామని చెప్పడానికి వీలు లేదు. పార్టీకి ఉన్న సభ్యత్వం కోల్పోయేలా చెయ్యడం నైతికత కాదు. రాజకీయాల్లో ఓటమి శాశ్వతం కాదు.. ఓడిపోతే పార్టీ నుంచి వెళ్లిపోవడం రాజకీయ లక్షణం కాదు.. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ తోనే ఉంటాన”ని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కాగా, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు నిన్న రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరూ వైసీపీని వదిలిపెట్టి టీడీపీలో చేరనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :