Friday, 14 November 2025 02:52:35 PM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

telangana High Court: నాగచైతన్య, శోభిత విషయంలో వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Date : 29 August 2024 11:30 AM Views : 205

Studio18 News - ANDHRA PRADESH / : సినీ సెలబ్రిటీలు, రాజకీయ పార్టీలపై జోస్యాలు చెబుతూ పాప్యులర్ అయిన అస్ట్రాలజర్ వేణుస్వామికి ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులపై వేణుస్వామికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల నాగచైతన్య, శోభిత నిశ్చితార్థ వేడుకలు జరగగా, కొన్ని గంటల వ్యవధిలోనే వేణుస్వామి వారి వైవాహిక జీవితంపై సంచలన జోస్యం చెప్పారు. 2027వరకే వారు కలిసి ఉంటారని తర్వాత విడిపోతారంటూ వేణుస్వామి ఒక వీడియో విడుదల చేశారు. వేణుస్వామి ఈ రకంగా జోస్యం చెప్పడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఆయన చెప్పిన జోస్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్.. తెలంగాణ మహిళా కమిషన్ కు వేణుస్వామిపై ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు స్వీకరించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ నుండి విచారణ ఎదుర్కోవాల్సి రావడంతో ఆ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. వేణుస్వామి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్య, శోభితకు లేని సమస్య మీకెందుకు? అంటూ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ను ప్రశ్నించింది. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :