Wednesday, 30 April 2025 08:08:13 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Chiranjeevi: ఈ సినిమాను నేచుర‌ల్‌గా తెర‌కెక్కించ‌టానికి టీమ్ ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌నిపించింది: చిరంజీవి

Date : 19 August 2024 05:54 PM Views : 96

Studio18 News - ANDHRA PRADESH / : నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల కాగా, డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంలను కూడా అందుకున్న ఈ సినిమా సెల‌బ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. ఇప్ప‌టికే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, క్రిష్‌, దేవిశ్రీప్ర‌సాద్ ఇలా చాలా మంది క‌మిటీ కుర్రోళ్ళు టీమ్‌ను అభినందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించి యావత్ చిత్రబృందాన్ని ప్ర‌త్యేకంగా అభినందించారు. నిర్మాత నిహారిక కొణిదెల‌, ద‌ర్శ‌కుడు య‌దువంశీతో పాటు చిత్రంలోని న‌టీన‌టులంద‌రూ చిరంజీవిని క‌లుసుకున్నారు. వారంద‌రితో చిరంజీవి ముచ్చ‌టిస్తూ స‌క్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌రిని ఆయ‌న అభినందించారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... "మా నిహారిక నిర్మించిన 'క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను చూశాను. చాలా బాగుంది. అంద‌రూ కొత్త కుర్రాళ్లే. చాలా చక్కగా నటించారు. సినిమా చూస్తున్న‌ప్పుడు కొత్త‌వాళ్లు యాక్ట్ చేస్తున్నార‌నే విష‌యాన్ని మ‌ర‌చిపోయాను. ఎమోష‌న‌ల్ సీన్స్ చాలా చ‌క్క‌గా పండాయి. న‌టీన‌టులంద‌రూ క‌థానుగుణంగా మేకోవ‌ర్ అయిన తీరు అద్భుతం. సినిమాను నేచుర‌ల్‌గా చిత్రీకరించ‌టంలో ఎంటైర్ టీమ్ ప‌డ్డ క‌ష్టం గురించి ఎంత చెప్పినా త‌క్కువే... అది తెర‌పై క‌నిపించింది. రీజ‌న‌బుల్ బ‌డ్జెట్‌లో సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు య‌దువంశీకి ప్ర‌త్యేక‌మైన అభినంద‌నలు. ద‌ర్శ‌కుడిగా త‌ను చ‌క్క‌టి ప్లానింగ్‌తో సినిమాలోని ప్ర‌తీ స‌న్నివేశాన్ని ముందుగా డిజైన్ చేసుకోవటం వ‌ల్ల బాగా తెర‌కెక్కించ‌గ‌లిగాడు. రీసెంట్‌గా విడుద‌లైన సినిమాల్లో క‌మిటీకుర్రోళ్లు ముందంజ‌లో ఉంటూ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది. ఎంటైర్ టీమ్‌కు నా అభినంద‌న‌లు’’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :