Wednesday, 12 November 2025 04:02:57 AM
# Shaheen: మా అమ్మాయి ఉగ్రవాదా?... నమ్మలేకపోతున్నాను!: డాక్టర్ షాహీన్ తండ్రి ఆవేదన # Ajith Kumar: సినీ నటుడు అజిత్ ఇంటికి, కాంగ్రెస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు # Ambati Rambabu: ఓ మై గాడ్... నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ # Bharati Dixit: ఐఏఎస్ అయిన నా భార్త వేధిస్తున్నాడు.. కిడ్నాప్ కూడా చేశాడు: ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు # Chandrababu Naidu: అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్... ఏపీ సమస్యలు వివరించిన సీఎం చంద్రబాబు # Jubilee Hills Bypoll: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం # Chhattisgarh Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... ఆరుగురు మావోయిస్టుల మృతి # Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు # Bihar Elections: బీహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం... ముక్తకంఠంతో చెబుతున్న ఎగ్జిట్ పోల్స్‌! # Amit Shah: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన... అధికారులకు అమిత్ షా ఆదేశాలు # India Russia Relations: భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు # Sanju Samson: సంజూ శాంసన్‌కు సీఎస్‌కే బర్త్‌డే విషెస్.. ఆ మెగా డీల్‌పై స్పష్టమైన సంకేతమా? # Delhi Blast: ఢిల్లీని వణికించిన కారు.. చాలా చేతులు మారిందా?.. దర్యాప్తులో కీలక విషయాలు # Delhi blast: పట్టుబడతాననే భయంతోనే.. ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! # Naseem Shah: పాక్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు # HR Department: హెచ్‌ఆర్ పొరపాటు.. సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్! # Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా కేసు.. ఫిల్మ్‌నగర్‌లో కలకలం # Hijras: కొత్త ఇల్లు కడితే రూ.లక్ష ఇవ్వాలట.. అంత ఇవ్వలేనన్న వ్యక్తిపై హిజ్రాల దాడి # Maganti Sunitha: జూబ్లీహిల్స్‌లో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఫైర్.. 14న చూసుకుందామంటూ వార్నింగ్‌! # Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ గాయంపై సంచలన విషయాలు.. అప్పుడు ఆక్సిజన్ 50కి పడిపోయింది!

AP Spl Police: జగన్ అన్యాయం చేశారు.. మీరైనా న్యాయం చేయండి: ఏపీ మాజీ స్పెషల్ పోలీసులు

Date : 10 August 2024 12:43 PM Views : 221

Studio18 News - ANDHRA PRADESH / : ఎలాంటి నోటీసు లేకుండా గత ప్రభుత్వం తమను ఉన్నట్టుండి విధుల నుంచి తొలగించిందని ఏపీ మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (సివిల్స్) వాపోయారు. రెండేళ్ల వెట్టిచాకిరీ తర్వాత జగన్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ముందు వారంతా ధర్నా చేశారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 జనవరి 2న రాష్ట్రవ్యాప్తంగా 2156 మందిని ఎస్పీఓలుగా నియమించిందని ఏపీ ఎస్పీఓల సంఘం రాష్ట్ర నాయకులు ధర్మ చంద్, చిట్టిబాబు చెప్పారు. నాటి ముఖ్యమంత్రి జగన్ ఇందుకోసం ప్రత్యేక జీవో జారీ చేశారని వివరించారు. తమను బార్డర్ చెక్ పోస్టులు, నార్కోటిక్, ఉమెన్ ట్రాఫికింగ్ విభాగాల్లో నియమించి విధులు అప్పగించారని తెలిపారు. రెండేళ్ల పాటు రాష్ట్రంలో ఎర్రచందనం, గంజాయి, ఉమెన్ ట్రాఫికింగ్‌ను అరికట్టామని వారు చెప్పారు. అయితే, 2022 మార్చి 31న ప్రభుత్వం ఎస్పీఓలు అందరినీ తొలగించిందని వాపోయారు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ అప్పట్లో సీఎం జగన్, మంత్రుల పేషీల చుట్టూ తిరిగినా కూడా న్యాయం జరగలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా తమ సమస్యను పట్టించుకోలేదని ధర్మ చంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీఓలు విధుల్లో లేకపోవడంతో గల్లీగల్లీలోనూ గంజాయి దొరుకుతోందని, ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకునే వారే లేకుండా పోయారని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పే కూటమి ప్రభుత్వం కూడా చేయకూడదని అభ్యర్థించారు. అక్రమ రవాణాకు, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు వెంటనే తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ధర్మ చంద్, చిట్టిబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :