Friday, 14 February 2025 06:52:13 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

ఆమె సూసైడ్‌కు నా కారే దొరికిందా..! మాధురి కారు ప్రమాదం ఘటనలో సరికొత్త ట్విస్ట్

Date : 12 August 2024 03:22 PM Views : 45

Studio18 News - ANDHRA PRADESH / : Divvala Madhuri Car Accident : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ ఇంటి వద్ద అతని భార్య దువ్వాడ వాణి, కుమార్తె నిరసన దీక్ష నాల్గోరోజూ కొనసాగుతుంది. మరోవైపు ఆదివారం దివ్వెల మాధురి ఆత్మహత్యా యత్నంకు పాల్పడింది. పలాస టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై ఆమె కారు ప్రమాదంకు గురైంది. స్వల్ప గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం మాధురి మాట్లాడుతూ.. చనిపోదామనే హైవే పైకి వచ్చానని తెలిపింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తన ఆడపిల్లలను సైతం ట్రోల్ చేస్తున్నారని, తాను మానసికంగా కుంగిపోయానని పేర్కొంది. ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలని హైవేపైకి వెళ్లానని, లారీ ఢీకొట్టి చనిపోదామని అనుకుంటే.. కారు ఢీకొట్టానని మాధురి చెప్పింది. మాధురి వేగంగా కారును డ్రైవ్ చేసి వేరే కారును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ కారు ఒరిస్సా హైకోర్టు అడ్వకేట్ సుధాకర్ ది. ఈ ఘటనపై సుధాకర్ స్పందించారు. తన కారును ఢీకొట్టిన మాధురిపై సుధాకర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆమె సూసైడ్ చేసుకోవటానికి నా కారే దొరికిందా అంటూ సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తన భార్య శైలజతో కలిసి పలాస బ్రాహ్మణతర్ల వచ్చాను. పలాస హైవేపై గూగుల్ మ్యాప్ లో అడ్రస్ చూడటానికి ఆగాను. ఆ సమయంలో మాధురి కారు వేగంగా వచ్చి నా కారును ఢీకొట్టిందని సుధాకర్ తెలిపారు. కారు ప్రమాదంలో నా భార్యకు చిన్న గాయాలయ్యాయి. మాధురి సూసైడ్ చేసుకోవటానికి నా కారును ఢీకొట్టడం దారుణం. ఇలాంటిది అనైతిక చర్య. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నట్లు సుధాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మాధురి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు