Monday, 17 March 2025 11:55:10 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

Vangalapudi Anitha: జగన్ సొంత డబ్బుతో ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదు: హోంమంత్రి అనిత

Date : 08 September 2024 04:08 PM Views : 92

Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడలో వరద పరిస్థితులు, సహాయక చర్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు వినాయకచవితి పండుగ కూడా జరుపుకోకుండా క్షేత్రస్థాయిలో ఉంటూ శ్రమిస్తున్నారని అనిత పేర్కొన్నారు. వరద వచ్చినప్పటి నుంచి ఆయన విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటూ, ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శిస్తూ, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మూడ్రోజుల పాటు బుడమేరు వద్దే మకాం వేసి, నిద్ర కూడా లేకుండా, గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇంతగా పాటుపడుతుంటే, జగన్ తన పేటీఎం బ్యాచ్ ను దించి విషప్రచారం చేయిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. జగన్ తన సొంతడబ్బుతో కనీసం ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదని, బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం చెబుతున్నారని విమర్శించారు. ఇక, విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు నిలిచే ఉందని వెల్లడించారు. వరద ముంపు బాధితులకు ఆహారం, నీరు సరఫరా చేస్తున్నామని... ఉదయం వేళల్లో టిఫిన్లు, మంచినీరు, పాల ప్యాకెట్లు అందించామని అనిత వివరించారు. నగరంలోని ముంపు కాలనీల్లో 170 వాటర్ ట్యాంకులు తిరుగుతున్నాయని, వాటర్ ట్యాంకులు రోజూ వందల ట్రిప్పులు తిరుగుతున్నాయని తెలిపారు. అగ్నిమాపక దళం సాయంతో ఇప్పటివరకు 27 వేలకు పైగా ఇళ్లలో బురదను తొలగించినట్టు అనిత పేర్కొన్నారు. డ్రోన్లతో ఆహారం సరఫరాతో పాటు, క్లోరినేషన్ ప్రక్రియ కూడా చేపట్టామని వెల్లడించారు. కేవలం డ్రోన్ల సాయంతోనే లక్షకు పైగా ఆహార ప్యాకెట్లను బాధితుల వద్దకు చేర్చామని స్పష్టం చేశారు. వినాయకచవితి మండపాలకు ఎలాంటి చలానాలు విధించలేదని వెల్లడించారు. మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవో తీసుకువచ్చింది జగన్ ప్రభుత్వమేనని అనిత ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలియగానే, ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేశారని వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :