Monday, 17 February 2025 04:37:46 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

YCP MP : విజయవాడలో వరదలు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విమర్శలు

Date : 02 September 2024 02:49 PM Views : 146

Studio18 News - ANDHRA PRADESH / : YCP MP Midhun Reddy : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కక్షపూరితంగా ఎన్డీయే నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో భారీ వర్షాలుపడి జనజీవనం అస్థవ్యస్థమైతే ప్రభుత్వం పట్టించుకోలేదు.. కానీ, సినీనటి కాదంబరి జత్వాని వ్యవహారాన్ని మాత్రం ఎందుకు భూతద్దంలో చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఆధారాలులేని నటి వ్యవహారానికి ఎందుకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.. నటి వ్యవహారంలో పోలీసులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. మదనపల్లె ఫైళ్ల కేసుపై అనవసర రాద్దాంతం చేస్తున్నారు. గుడివల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనను ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. గుడివల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై ఆధారాలు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ లు మాత్రం పట్టించుకోవడం లేదని మిథున్ రెడ్డి విమర్శించారు. ప్రశ్నించిన వారిని కూటమి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పుంగనూరులో మున్సిపల్ ఛైర్మన్, మిగిలిన సభ్యులను భయపెట్టి టీడీపీలో చేరమని ఒత్తిడి తెస్తున్నారని మిథున్ రెడ్డి టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు