Thursday, 12 March 2026 04:10:09 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

YCP MP : విజయవాడలో వరదలు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విమర్శలు

Date : 02 September 2024 02:49 PM Views : 433

Studio18 News - ANDHRA PRADESH / : YCP MP Midhun Reddy : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కక్షపూరితంగా ఎన్డీయే నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో భారీ వర్షాలుపడి జనజీవనం అస్థవ్యస్థమైతే ప్రభుత్వం పట్టించుకోలేదు.. కానీ, సినీనటి కాదంబరి జత్వాని వ్యవహారాన్ని మాత్రం ఎందుకు భూతద్దంలో చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఆధారాలులేని నటి వ్యవహారానికి ఎందుకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.. నటి వ్యవహారంలో పోలీసులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. మదనపల్లె ఫైళ్ల కేసుపై అనవసర రాద్దాంతం చేస్తున్నారు. గుడివల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనను ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. గుడివల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై ఆధారాలు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ లు మాత్రం పట్టించుకోవడం లేదని మిథున్ రెడ్డి విమర్శించారు. ప్రశ్నించిన వారిని కూటమి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పుంగనూరులో మున్సిపల్ ఛైర్మన్, మిగిలిన సభ్యులను భయపెట్టి టీడీపీలో చేరమని ఒత్తిడి తెస్తున్నారని మిథున్ రెడ్డి టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :