Wednesday, 26 March 2025 05:21:15 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

ఢిల్లీ వెళ్లి మీ బాబాయ్ కేసు కోసం ధర్నా చేయండి- జగన్‌పై మంత్రి అనిత ఫైర్

Date : 24 August 2024 05:40 PM Views : 64

Studio18 News - ANDHRA PRADESH / : Anitha Vangalapudi : ఏపీలో రెండు ప్రమాదాలు జరగడం దురదృష్టకరం అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేయకపోతే మృతుల సంఖ్య పెరిగేదన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయని.. క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రులకు తరలించామని వివరించారు. సహాయ చర్యల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను మంత్రి అనిత కొట్టిపడేశారు. ప్రమాదం రోజు విజయవాడ నుండి తాను రోడ్డు మార్గంలో ఘటనా స్థలానికి రాత్రి 12.30 కు చేరుకున్నానని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించారని చెప్పారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారని, తక్షణమే అధికారులతో సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. సీఎం ప్రకటించిన 24 గంటల గడవక ముందే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేశామన్నారు హోంమంత్రి అనిత. ”జగన్ ధర్నా చేయాలంటే చాలా ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడికి పిలిపించుకున్నారు? ఎల్జీ పాలిమర్స్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారా? ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15 మంది మృతి చెందితే 12 మందికే ఎక్స్ గ్రేషియా ఇచ్చారు. ముగ్గురికి ఇప్పటికీ ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు. పులివెందుల ఎమ్మెల్యే అనకాపల్లి వచ్చి ప్రమాదంపై మంత్రులు, ప్రభుత్వం స్పందించడం లేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంకటాపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఇప్పటికీ హాస్పిటల్ లేదు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతారు. ధర్నా చేయాలంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయండి. మీ బాబాయ్ కేసు కోసం ధర్నా చేయండి. మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చేస్తున్న పనులు కోసం ధర్నా చేయండి. గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి ఒక్కసారైనా అధికారులతో సమావేశం నిర్వహించారా? పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే, పరిశ్రమ మూసివేస్తాం అని హెచ్చరించాం. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, కఠిన చర్యలు ఉంటాయి” అని వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి అనిత.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :