Wednesday, 30 April 2025 08:43:23 AM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

సజ్జల కనుసన్నల్లోనే జిత్వానీ వ్యవహారం.. వారిని అదుపులోకి తీసుకోవాలి : బుద్దా వెంకన్న

Date : 30 August 2024 01:23 PM Views : 99

Studio18 News - ANDHRA PRADESH / : TDP Leader Buddha Venkanna : వైసీపీ ప్రభుత్వం హయాంలో అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం అని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశాం. గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సకలశాఖల మంత్రి చేసిన దారుణం చూస్తున్నాం. జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో చూడండి. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీఇన్నీ కావు. ఆడుదాం ఆంధ్రా అని కోట్లు దోచుకున్నారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలను నాశనం చేశారంటూ బుద్దా వెంకన్న మండిపడ్డారు. నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుంది. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్ లు పరుగులు పెట్టారంట. ఛీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం అంటూ బుద్దా వెంకన్న వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ ప్రశ్నించారు. సజ్జల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం మొత్తం నడిపారు. ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలని బుద్దా వెంకన్న అన్నారు. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాద్ రెడ్డి, కాంతి రాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలి. ఈ కేసుల్లో పాత్రదారులు, సూత్రదారులను ప్రాసిక్యూట్ చేయాలి బుద్దా వెంకన్న డిమాండ్ ప్రభుత్వాన్ని కోరారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. చివరకు ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహరించారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :