Sunday, 20 April 2025 02:24:15 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Akhilesh Yadav: ఢిల్లీలో జగన్ దీక్షకు మద్దతు తెలిపాక అఖిలేశ్ యాదవ్ ఏమన్నారో తెలుసా?

Date : 24 July 2024 02:14 PM Views : 124

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. అధికారం కోల్పోయిన వారిపై దాడులు చేస్తున్నారని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ చేస్తున్న ధర్నాకు అఖలేశ్ యాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ… దాడులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని, రేపు జగన్ ముఖ్యమంత్రి కావచ్చని చెప్పారు. బుల్డోజర్ రాజకీయాలకు సమాజ్ వాదీ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. భయపట్టే వారు అధికారం కోల్పోతారని అన్నారు. జగన్ పార్టీ కార్యకర్తల కోసం పోరాడుతున్నారని చెప్పారు. పార్టీని కార్యకర్తలే మళ్లీ అధికారంలోకి తీసుకువస్తారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో కూడా బుల్డోజర్ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని చెప్పారు. బీజేపీ తన తీరు మార్చుకోవాలని అన్నారు. ప్రజలు హింసను సహించరని చెప్పారు. రేపు ఏపీలో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చని, కానీ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని అన్నారు. రాజకీయాల్లో అధికారంలో ఉంటాం.. పోతామని చెప్పారు. ఇతరుల ప్రాణాల్ని తీయాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయ కక్షలు అవసరం లేదని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :