Thursday, 12 March 2026 03:18:35 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

చంద్రబాబుకి ఈ విషయంపైనే ఎక్కువ శ్రద్ధ ఉంది: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

Date : 02 September 2024 03:09 PM Views : 315

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైసీపీ మీద, ఆ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను తీర్చడంపై లేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్లు వచ్చి ప్రజలంతా తిండిలేక ఇబ్బందులు పడుతుంటే వారి గురించి పట్టించుకోకుండా వేరే పనులు చేస్తున్నారని విమర్శించారు. సచివాలయాలు ఉన్నాయని, కనీసం ఆ సిబ్బందిని అప్రమత్తం చేయలేదని సీదిరి అప్పలరాజు చెప్పారు. జగన్‌ని తిట్టడానికే అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. బుడమేరు గేట్లు అర్ధరాత్రి తెరవడంవల్లే విజయవాడ మునిగిపోయిందని, దీనికి బాధ్యత ఎవరిదని నిలదీశారు. కరకట్టలో చంద్రబాబు నాయుడి ఇల్లు అక్రమ కట్టడమని, అందులో ఉండి మునిగిపోతే పరువుపోతుందని బస్సులో ఉంచారని అప్పలరాజు అన్నారు. బైటకేమో కలెక్టరేట్లో ఉన్నామని ప్రచారం చేస్తున్నారని, అధికారులందరితో కలిసి తిరుగుతూ ఉంటే ప్రజలకు ఏర్పాట్లు ఏవరు చేస్తారని నిలదీశారు. అనుభవం ఎక్కువ అయ్యాక చంద్రబాబులో నిర్లక్ష్యం ఎక్కువైందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం విఫలం చెందిందని, జగన్ ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదని విజయవాడ ప్రజలు అంటున్నారని చెప్పుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :