Wednesday, 19 March 2025 07:08:45 PM
# 'క్రష్డ్ ' (అమెజాన్ మినీ ప్లేయర్) సిరీస్ రివ్యూ! # Parag Shah: మన దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే... అత్యంత పేద ఎమ్మెల్యే.... ఎవరో తెలుసా...! # KTR: ప్రగతి రథానికి పంక్చర్ వేశారు... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్ # Momo Factory: పంజాబ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. మోమోస్ త‌యారీ కేంద్రంలో కుక్క మాంసం...! # Bandi Sanjay: ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉంది: బండి సంజయ్ # Realme: కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ... బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్! # Vodafone Idea 5G : Vi యూజర్లకు గుడ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా 5G సేవలు మీకోసం.. కొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే..! # Infinix Note 50X 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ నెల 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కలర్ ఆప్షన్లు ఇవేనట..! # Aadhaar Update : మీకు కొత్తగా పెళ్లి అయిందా? మీ ఆధార్ పేరు, అడ్రస్ మార్చుకోలేదా? ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్ మీకోసం.! # JioCinema Subscription : జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఇకపై ‘జియోసినిమా’ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉండదు.. చెక్ చేసుకోండి! # Pawan Kalyan: టీడీపీని ఈయనే గెలిపించాడంట... నాశనానికి ముందు ఇలాంటి గర్వమే వస్తుంది: కేఏ పాల్ # Election Commission of India: ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానానికి మొగ్గు చూపిన ఎన్నికల సంఘం # Rahul Gandhi: మహా కుంభమేళాపై మోదీ మాటలకు నేను మద్దతిస్తాను... కానీ!: రాహుల్ గాంధీ # Vijay Sai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు # YS Sharmila: అప్పుడు జగన్ చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు: షర్మిల # Andhra Pradesh: తక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఏపీ # Indian Labor Unions: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు # Nidhi Agarwal: బెట్టింగ్ యాప్ వ్యవహారం... నిధి అగర్వాల్ పైనా కేసు తప్పదా...? # Chandrababu Naidu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్... రేపు మోదీ, బిల్ గేట్స్ లను కలవనున్న ఏపీ సీఎం # New Delhi: అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

Pendyala Srinivas: చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ పై సస్పెన్షన్ ఎత్తివేత.. సస్పెన్షన్ కాలం ఆన్ డ్యూటీగా మార్పు

Date : 10 September 2024 04:26 PM Views : 43

Studio18 News - ANDHRA PRADESH / : గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుకు పీఎస్ గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఉన్న విచారణను సైతం ఆపేశారు. సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పీఎస్ గా 15 ఏళ్లకు పైగా పెండ్యాల పని చేశారు. వైసీపీ హయాంలో 4 సార్లు ఆయన సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు. 2023 సెప్టెంబర్ 29న అప్పటి వైసీపీ ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. 2023 అక్టోబర్ 26న ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. విధులకు గైర్హాజరు అయ్యారని, అనుమతులు లేకుండానే దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లారని ఆయనపై అభియోగాలు మోపారు. ఈ క్రమంలో, 2024 జనవరి 8న పెండ్యాల శ్రీనివాస్ పై విచారణ జరిపేందుకు విచారణాధికారిని నియమించారు. 2024 ఆగస్ట్ 1న విచారణాధికారి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. శ్రీనివాస్ పై ఉన్న అభియోగాలు కొంత వరకు నిరూపితమయ్యాయని సదరు విచారణాధికారి తన నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. శ్రీనివాస్ పై కొన్ని అభియోగాలు కొంత వరకు నిరూపితమయ్యాయన్న విచారణ నివేదికలోని అంశంపై స్పందిస్తూ... మరోసారి అలాంటివి పునరావృతం కాకూడదని శ్రీనివాస్ కు సూచించింది. ఆయనను విధుల్లోకి తీసుకుంటున్నట్టు జీవోలో పేర్కొంది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఆయనను నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :