Sunday, 08 February 2026 09:55:21 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

ఎవరెన్ని ఎత్తులేసినా విశాఖ ఎమ్మెల్సీ కూటమిదే.. జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభంలో..

Date : 11 August 2024 02:43 PM Views : 303

Studio18 News - ANDHRA PRADESH / : Janasena party office opened in Visakha district : విశాఖ జిల్లాలో జనసేన పార్టీ నుతన కార్యాలయం ప్రారంభమైంది. కార్యాలయం ప్రారంభోత్సవానికి మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్, జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్, టీడీపీ, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభానికి టీడీపీ, బీజేపీ నేతలు కూడా రావడం సంతోషంగా ఉందని అన్నారు. విశాఖ వేదికగా ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా జనసేన పార్టీ ఆఫీసులో నేను అందుబాటులో ఉంటానని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే విధంగా మా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. విశాఖలోఉన్న సహజ వనరులను వినియోగించుకుంటూ టూరిజం పరంగా, ఐటీ పరంగా అభివృద్ధి చెయ్యాలని కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉందని చెప్పారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎవరనేది రేపు ప్రకటించే అవకాశం ఉందని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరపున బరిలో నిలిచే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని అన్నారు. ఎవరి వ్యక్తి గత విషయాలను మాట్లాడను. కానీ, కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వారిని విహార యాత్రలకు తిప్పుతున్నాడని అన్నారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని జనసేన ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. దువ్వాడ ఇష్యూపై స్పందిస్తూ.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కష్టాల్లో ఉన్నాడు.. ఆయనకు నా సానుభూతిని తెలుపుతున్నానని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :