Sunday, 20 April 2025 02:24:51 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించిన విజయం: కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులపై జనసేన

Date : 23 July 2024 04:42 PM Views : 157

Studio18 News - ANDHRA PRADESH / : Janasena on Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు రూపాయలు కేటాయించిన కేంద్రం, అవసరమైతే పెంచుతామని చెప్పడం సంతోషకరమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారు. విభజన చట్టంలో పొందు పరిచిన హామీలను నెరవేరుస్తామని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్‌తో పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు వస్తాయని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్‌తోనూ పెట్టుబడులు పెరుగుతాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించిన విజయంగా ఆయన వర్ణించారు. ఎన్డీఏ ఆర్కిటెక్ట్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కేంద్ర పెద్దలను కలవడం వల్ల ఏపీకి కేంద్ర బడ్జెట్ నుంచి అధిక నిధులు వచ్చాయని చెప్పారు. ఏపీకి శుభదినం: మంత్రి అనగాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించడం ప్రజలందరూ ఆనందపడే అంశమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు శుభదినం. రాష్ట్ర పుననిర్మాణానికి కట్టుబడి ఉన్నామని మోదీ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అమరావతికి ఢోకా లేదు: సోమిరెడ్డి అమరావతి అభివృద్ధికి ఎటువంటి ఢోకా లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ.. చెన్నై, విశాఖ పారిశ్రామిక కారిడార్ మంజూరు కావడం అభివృద్ధికి సంకేతం. పోలవరం డ్యాం కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. జగన్ డ్యామేజ్ చేయడం కోసం ఢిల్లీ వెళ్లారు. జగన్ ఆటలు సాగలేదు. అమరావతికి చంద్రబాబు పూర్వవైభవం తీసుకురానున్నారు. అమరావతి 15000 వేల కోట్లరూపాయలు కేంద్రం చెలించడం సంతోషం. పోలవరం ప్రాధాన్యత ఇస్తూ నిధులు ఇస్తామనడం శుభపరిణామం. వెనుకబడిన జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామనడం మంచి పరిణామం. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌కి ధన్యవాదాలని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :