Sunday, 20 April 2025 03:24:15 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికేసులో సజ్జల, ఆర్కేలకు ఊరట

Date : 23 July 2024 02:51 PM Views : 118

Studio18 News - ANDHRA PRADESH / : TDP Central Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు ఊరట లభించింది. ఈ కేసు విషయంపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, కార్యాలయంపై దాడి కేసులో ఈరోజు వరకు సజ్జల, ఆర్కేలను నిందితులుగా చేర్చలేదని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకవేళ నిందితులుగా వీరిని చేర్చితే ఐదు రోజుల ముందే సమాచారం ఇస్తామని చెప్పారు. దీంతో సజ్జల, ఆర్కే హైకోర్టులో వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ కేంద్రం కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి కేసులో నిందితులుగా దేవినేని అవినాశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ తోపాటు తదితరులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. తొందరలోనే వీరందరినీ అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సజ్జల, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తులశిల రఘురాం, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్ లు ముందస్తు బెయిల్ కు హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపి.. వైసీపీ నేతలను జూలై 16వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 16న మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. మరోసారి ముందస్తు బెయిల్ గడువును జూలై 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మంగళవారం ఈ కేసులో హైకోర్టులో విచారణ జరగగా.. సజ్జల, రామకృష్ణా రెడ్డిల పేర్లు నిందితుల జాబితాలో చేర్చలేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు సజ్జల, ఆర్కే దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిందిమరోవైపు సీఎం చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారన్న కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్, నందిగాం సురేష్ కు ముందస్తు బెయిల్ ను హైకోర్టు పొడిగించింది. ఆగస్టు 2 వరకు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :