Thursday, 15 May 2025 03:26:01 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

మరోసారి రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం.. తమ తండ్రి తమకు కావాలంటూ కుమార్తె ఆవేదన

Date : 09 August 2024 04:20 PM Views : 156

Studio18 News - ANDHRA PRADESH / : YCP MLC Duvvada Srinivas Family Controversy : శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. తమ తండ్రి శ్రీనివాస్ వేరే మహిళతో ఉంటున్నాడని.. మా వద్దకు రావాలని ఆయన కుతుళ్లు కోరారు. ఈ మేరకు గురువారం రాత్రి శ్రీనివాస్ నివాసం ఉండే ఇంటికి వద్దకు వెళ్లి తండ్రిని కలిసే ప్రయత్నం చేశారు. కానీ, ఇంటి గేటు తీయకపోవటంతో కారులోనే కొద్దిసేపు ఉండి వెనుదిరిగారు. అయితే, గత రెండేళ్లుగా వారి కుటుంబంలో విబేధాలు కొనసాగుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య జడ్పీటీసీ దువ్వాడ వాణి వేరువేరుగా ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా తొలగించింది. దువ్వాడ వాణికి బాధ్యతలు అప్పగించింది. మళ్లీ ఎన్నికల సమయానికి దువ్వాడ శ్రీనివాస్ కే టికెట్ కేటాయించారు. ఆ సమయంలో దంపతుల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. గత ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు వాణి ప్రయత్నించినప్పటికీ పార్టీ పెద్దల సూచలనతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. అయితే, తాజాగా భార్యాభర్తల మధ్య మరో మహిళ ఎంట్రీ ఇచ్చింది. దీంతో దువ్వాడ కూతుళ్లు రోడ్డెక్కారు. మానాన్న మాకు కావాలంటూ శ్రీనివాస్ నివాసం ఉండే ఇంటివద్దకు వెళ్లారు. దవ్వాడ శ్రీను అక్కవరం ఇంటి వద్ద మరో మహిళతో కలిసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గురువారం రాత్రి దువ్వాడ శ్రీను-వాణిల కుమార్తెలు హైందవి, నవీనలు దువ్వాడ కొత్త నివాసం వద్దకు వెళ్లారు. కారులోనే శ్రీను ఇంటి ముందే వేచిఉన్నారు. తండ్రికి కూతళ్లు ఫోన్ చేసినా, మెస్సేజ్ లు పెట్టినా స్పందన కనిపించలేదు. ఇంటి గేటుకూడా తీయకపోవటంతో వారు కొద్దిసేపు ఉండి వెనుదిరిగి వచ్చేశారు.తమ తండ్రి మరో మహిళతో ఉంటూ తమను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మా తండ్రి మా వద్దకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :