Tuesday, 17 September 2024 12:34:57 AM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

శివరామకృష్ణ కమిటీ చెప్పినా వినలేదు.. వరదలకు రాజధాని మునిగింది: మాజీ ఎంపీ మేకపాటి

Date : 04 September 2024 01:17 PM Views : 23

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Mekapati Rajamohan Reddy: అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు నాయుడు వినలేదని, ఇప్పుడు వరదలతో రాజధాని మునిగిపోయిందని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, తన చిన్న కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి బుధవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ”వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది. జగన్ కోరిక మేరకు నా కుమారుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. తర్వాత మంత్రిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి అని పేరు పెడితే.. దాన్ని తొలగించడం దారుణం. నెల్లూరు బ్యారేజీకి నిజాయతీపరుడుగా ఉన్న నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడితే దాన్ని సైతం తీసేయ్యడం దుర్మార్గం. అధికారం శాశ్వతం కాదనే విషయాన్నీ చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చెయ్యకపోవడం చంద్రబాబు ట్రాక్ రికార్డు. రాజశేఖరరెడ్డి చెప్పినవి, చెప్పనవి కూడా చేశారు. ఆయన బతికి ఉంటే మూడుసార్లు సీఎం అయ్యేవారు.. రాష్టం విడిపోయేది కాదు. శేష జీవితంలో అయినా ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచన చంద్రబాబుకి రావాలి. వరద బాధితులకు నా వంతు సాయంగా ఏపీకి 25 లక్షలు, తెలంగాణకి 25 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాన”ని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. బ్యారేజీల పేర్లు మార్చడం సరికాదు: కాకాణి నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పేర్లు మార్చడం సరికాదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ”గౌతమ్ రెడ్డి కోసమే జగన్ మూడు సార్లు జిల్లాకి వచ్చారు. ఆయన జ్ఞాపకర్థం సంగం బ్యారేజీకి ఆ పేరు పెట్టారు. వాటిని తొలగించడం వల్ల చంద్రబాబుకి వచ్చిన లబ్ది ఏంటో అర్ధం కాలేదు. బ్యారేజీల పేర్లు మార్చిన చంద్రబాబును ప్రజలు అసహ్యహించుకుంటున్నారు. రెండు బ్యారేజీలకి అంతకుముందున్న పేర్లు కొనసాగించాల”ని కాకాణి డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :