Wednesday, 30 April 2025 09:38:36 AM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Gudivada Amarnath: పడవలపై దుష్ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్: గుడివాడ అమర్ నాథ్

Date : 09 September 2024 03:25 PM Views : 94

Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడ ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ బోట్లకు వైసీపీ రంగులు ఉండటంతో... దీని వెనుక వైసీపీ కుట్ర కోణం ఉందని అధికారపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందిస్తూ... ఆ పడవలు వైసీపీ నేతలవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని... బోట్ల ఘటనపై దర్యాప్తు చేయించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ విపత్తు సంభవించిందని అమర్ నాథ్ విమర్శించారు. బుడమేరు కాల్వకు వరద వస్తుందని 20 గంటల ముందే తెలిసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. డీఈ చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడటంపై లేదని అన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదని చెప్పారు. వరదల కారణంగా ప్రజలు మునిగిపోతారని తెలిసినా నిర్లక్ష్యం వహించారని అమర్ నాథ్ మండిపడ్డారు. విజయవాడ వరద మరణాలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. దీనికి చంద్రబాబు, అధికారులు బాధ్యత వహించాలని చెప్పారు. గతంలో అల్లూరి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు 250 గ్రామాల ప్రజలను తాము రక్షించామని అన్నారు. జేసీబీలపై చంద్రబాబు తిరగడం ప్రచారం కోసమేనని ఎద్దేవా చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :