Tuesday, 18 March 2025 12:04:16 AM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

AP Woman: హృద‌య‌విదార‌కం... గ‌ల్ఫ్ నుంచి తిరిగొస్తూ... బ‌స్సులోనే ప్రాణాలొదిలిన మహిళ!

Date : 28 August 2024 02:35 PM Views : 159

Studio18 News - ANDHRA PRADESH / : ఉపాధి కోసం మస్కట్‌ వెళ్లిన ఓ మహిళ అక్క‌డ య‌జ‌మానుల పోరు భ‌రించ‌లేక స్వ‌దేశానికి తిరిగొచ్చింది. సొంత ఊరికి వెళ్లేందుకు బ‌స్సు ఎక్కింది. కానీ, ఇంటికి చేర‌కుండానే బ‌స్సులోనే ప్రాణాలొదిలింది. ఏపీకి చెందిన ఓ మ‌హిళ‌ హైదరాబాద్‌ నుంచి తణుకు వెళుతుండగా బస్సులోనే గుండెపోటుతో మృతిచెందిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస‌లేం జ‌రిగిందంటే.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన ప్రభాకర్‌కు తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన బొంతా సత్య పద్మతో 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంప‌తుల‌కు ఇద్దరు పిల్లలు. అయితే, ఈ కుటుంబానికి ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడాయి. దాంతో సత్య పద్మ భర్తకు ఆర్థికంగా సాయం చేసేందుకు ఏదైనా పనిచేయాలని అనుకుంది. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన ఓ మహిళా ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది. దాని కోసం త‌న వ‌ద్ద ఉన్న‌ డబ్బుతో పాటు మరికొంత అప్పు చేసి మొత్తం రూ. 2 లక్షలు ఏజెంట్‌కు ఇచ్చింది. దాంతో ఆమెను ఏజెంట్ గల్ఫ్ దేశం మస్కట్‌ పంపించింది. కానీ అక్క‌డికి వెళ్లిన స‌త్య ప‌ద్మ‌కు అనుకున్న ప‌ని దొర‌క‌లేదు. దొరికిన ప‌ని చేసుకుందామ‌నుకుంటే య‌జ‌మానుల పోరు ఎక్కువైంది. విశ్రాంతి లేకుండా ఎక్కువ ప‌ని చెప్ప‌డంతో ఆమెకు ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తాయి. దాంతో చేసేదేమిలేక స్వ‌దేశానికి వ‌చ్చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇదే మాట అక్క‌డి య‌జ‌మానుల‌తో పాటు ఇక్క‌డి ఏజెంట్‌కు చెప్పింది. దాంతో రెండు లక్షలు ఇస్తేనే స్వ‌దేశానికి వచ్చే ఏర్పాట్లు చేస్తామని ఏజెంట్ చెప్పింది. ఇక్క‌డ‌ ఉన్న భర్త ప్రభాకర్‌ ఏజెంట్‌కు ఆ రెండు లక్షలు చెల్లించాడు. అలా డబ్బులు చెల్లించిన తర్వాత సత్యపద్మ ఈ నెల 24న మస్కట్‌ నుంచి స్వ‌దేశానికి బయల్దేరింది. మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. తణుకు బస్సు ఎక్కింది. కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం మ‌రింత‌ క్షీణించ‌డంతో బస్సులో గుండెపోటుకు గురైంది. దాంతో కూర్చున్న సీటులోనే మృతిచెందింది. ఇది గమనించిన బస్సు డ్రైవర్‌, కండక్టర్‌.. సత్య పద్మ భ‌ర్త‌కు ఫోన్‌ చేసి స‌మాచారం ఇచ్చారు. ఏజెంట్‌కు డబ్బులు చెల్లించిన తర్వాత తన భార్య ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రభాకర్ భోరున విలపించాడు. ఈ నెల 30న పంపిస్తామని చెప్పి 24వ తేదీనే పంపించేశారని తెలిపాడు. ఆమె అనారోగ్యం గురించి తెలిసి కూడా ఇలా చేయ్య‌డం దారుణ‌మ‌ని ప్ర‌భాక‌ర్ కన్నీరుమున్నీరు అయ్యాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :