Wednesday, 30 April 2025 04:07:27 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు..

Date : 22 July 2024 10:53 AM Views : 124

Studio18 News - ANDHRA PRADESH / : Dowleswaram Barrage : గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాల కారణంగా గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. బ్యారేజ్ వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరింది. 175 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి 9లక్షల86వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలంటే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయ చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.ఏజెన్సీ ప్రాంతంలో వరద ప్రభావం పెరగడంతో గిరిజన వాసులు భయాందోళన చెందుతున్నారు. విలీన మండలాల్లో వాగులు వంకలతోపాటు శబరి, గోదారి ఉగ్రరూపం దాల్చడంతో సుమారు 200 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు – భద్రాచలం ప్రధాన రహదారిపై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహయచర్యలు అందించేందుకు లాంచీలతో పాటు బఫ్ఫర్ స్టాక్ ను అధికారులు ఏర్పాటు చేశారు. దేవీపట్నం మండలం, సీతానగరం మండలాలపై వరద ప్రభావం తీవ్ర స్థాయి ఉంది.కోనసీమ ప్రాంతంలో పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద నాలుగు గ్రామాలకు నాటు పడవపై లంకవాసులు ప్రయాణం చేస్తున్నారు. పి గన్నవరం – పశ్చిమగోదావరి జిల్లాలను కలిపే కనకాయలంక కాజ్ వే పైనుండి వరద నీరు ప్రవహిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని కలెక్టర్లు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు గోదావరి వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ అందుకు అనుగుణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :