Thursday, 12 March 2026 01:33:04 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Budda Venkanna: చేతిలో ఏమీ లేకపోవడంతో నా మాట చెల్లడం లేదు: బుద్ధా వెంకన్న

Date : 03 August 2024 05:00 PM Views : 470

Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోరాటాలు చేసిన వారికి గౌరవం లేదని, పవర్ లో ఉన్నవారికే గౌరవం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటాలు చేసిన వారు వాస్తవానికి ఎమ్మెల్యే అవ్వాలని, ఇప్పుడీ విషయం తనకు అర్థమైందని అన్నారు. కార్యకర్తలకు న్యాయం చేయాలన్నా తాను చేయలేని పరిస్థితిలో ఉన్నానని బుద్ధా వెంకన్న నిస్సహాయత వ్యక్తం చేశారు. సీఐల బదిలీల విషయంలో ఎమ్మెల్యేలు ఎవరిని చెబితే వారిని నియమించారని, పదవిలో లేను కాబట్టి తన మాట చెల్లడంలేదని అన్నారు. నాడు చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేశ్ దాడికి వెళితే తాను అడ్డుగా నిలబడ్డానని, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అప్పుడు ఎవరైనా వచ్చారా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. "ఇప్పుడు ఓపెన్ గా చెప్పేస్తున్నా... నాకు మనసులో దాచుకోవడం నచ్చదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఎలాంటి పోరాటాలు చేశానో ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. కానీ ఇప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది కాబట్టి నేను పోరాటాలు చేయలేను... నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? విజయవాడ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పెద్ద కాబట్టి ఎంపీ చిన్ని గారికి చెబుతున్నా. ఆవేదన వస్తే అది అగ్నిపర్వతమై పేలిపోతుంది. ప్రేమతో ఉంటాను తప్ప నేను ఎవరికీ భయపడను. మీరు మాకేమీ న్యాయం చేయలేకపోతున్నారని కార్యకర్తలు అంటున్నారు. ఏం చేస్తాం? చేతిలో ఏమైనా ఉంటేనే కదా చేయడానికి? పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ అంశాన్ని నేను చంద్రబాబు, లోకేశ్ ల దృష్టికి తీసుకెళతా" అని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :