Studio18 News - ANDHRA PRADESH / : Vijayawada Floods : విజయవాడలో వరద బీభత్సం సృష్టించింది. నగరంలోని లక్షలాది బైకులు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం వరద నీరు తగ్గడంతో వాహనదారులు బైక్ మెకానిక్ షాపులకు క్యూ కడుతున్నారు. సర్వీసింగ్ కు వెయ్యి నుంచి 3వేల రూపాయలు.. ఇంజిన్ పాడైపోతే 10 నుంచి 15వేల రూపాయలు ఖర్చు అవుతోందని వాహనదారులు వాపోతున్నారు. మెకానిక్ షాపులకు బైకులు భారీగా వస్తుండటంతో మెకానిక్ లు ఫుల్ బిజీ అయిపోయారు.
Admin
Studio18 News