Sunday, 08 February 2026 12:52:24 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

అందుకే ఎక్కడ చూసినా రికార్డులు తగలబెడుతున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు

Date : 19 August 2024 04:54 PM Views : 326

Studio18 News - ANDHRA PRADESH / : అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు వినతులు సేకరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలోని అక్రమాలు బయట పడుతున్నాయని, అందుకే ఎక్కడ చూసినా రికార్డులు తగలబెడుతున్నారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని, రికార్డులను తగులబెట్టిన ఘటనలపై విచారణ జరిపిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. గత ప్రభుత్వం సొంత జాగీరులా రవాణా శాఖలో దోపిడీ కోసం ఐదు జోన్లను ఏర్పాటు చేశారని అన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిందని అచ్చెన్నాయుడు చెప్పారు. భూ రికార్డులను తారుమారు చేశారని, ఎక్కడ చూసినా భూ సమస్యల మీద ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. త్వరలో గ్రామాలలో రెవెన్యూ అధికారులను పంపి గ్రామ సభలు పెడతామని అన్నారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లు రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఆ పార్టీ నేతలు ఒక్కరు కూడా మిగలరని తెలిపారు. ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదని, అయితే తప్పు చేసినవాడు ఏ పార్టీ వాడైనా వదలొద్దని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :