Sunday, 08 March 2026 09:38:33 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ఆ సమయంలో ఆ ఉద్యోగి ఎందుకు వెళ్లాడు? మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం

Date : 22 July 2024 05:48 PM Views : 352

Studio18 News - ANDHRA PRADESH / : Madanapalle sub collectors office fire Incident : మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన చాంబర్ లో జరిగిన సమీక్షకు సీఎస్, సీఎంవో అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్ హాజరయ్యారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్దమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారంలో సీసీ ఫుటేజ్ తో సహా మొత్తం వివరాలు బయటకు తీయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో డీజీపీ ద్వారక తిరుమలరావు మదనపల్లికి బయలుదేరారు. ఇక, ఈ ఘటనపైన జిల్లా కలెక్టర్ తో కూడా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన రాత్రి 11 గంటల 24 నిమిషాలకు జరిగినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సత్వరం స్పందించకపోవడంపై చంద్రబాబు ఆరా తీశారు. నిన్న రాత్రి 10.30 గంటల వరకు కార్యాలయంలో గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నట్లు వారు సీఎంకు తెలిపారు. ఆ సమయంలో అతడు అక్కడికి ఎందుకు వెళ్లాడు? ఏ పని కోసం వెళ్లాడు? అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన సమయంలో విధుల్లో వీఆర్ఏలు ఉన్నారని చంద్రబాబుకు తెలిపారు అధికారులు. ఘటనా స్థలానికి పోలీస్ జాగిలాలు వెళ్లాయా? ఉదయం నుంచి ఏం విచారణ చేశారని అధికారులు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపైనా చంద్రబాబు ప్రశ్నించారు. ఘటన జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైన విచారణ జరపాలని, సీసీ కెమెరాలో ఫుటేజీని వెంటనే హ్యాండోవర్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డేటా సేకరించాలని సూచించారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలను అధికారులు మర్చిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాఫ్తు జరపాలన్నారు. ఈ ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది? అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :