Saturday, 26 April 2025 06:14:01 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆ సమయంలో ఆ ఉద్యోగి ఎందుకు వెళ్లాడు? మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం

Date : 22 July 2024 05:48 PM Views : 99

Studio18 News - ANDHRA PRADESH / : Madanapalle sub collectors office fire Incident : మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన చాంబర్ లో జరిగిన సమీక్షకు సీఎస్, సీఎంవో అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్ హాజరయ్యారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్దమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారంలో సీసీ ఫుటేజ్ తో సహా మొత్తం వివరాలు బయటకు తీయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో డీజీపీ ద్వారక తిరుమలరావు మదనపల్లికి బయలుదేరారు. ఇక, ఈ ఘటనపైన జిల్లా కలెక్టర్ తో కూడా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన రాత్రి 11 గంటల 24 నిమిషాలకు జరిగినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సత్వరం స్పందించకపోవడంపై చంద్రబాబు ఆరా తీశారు. నిన్న రాత్రి 10.30 గంటల వరకు కార్యాలయంలో గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నట్లు వారు సీఎంకు తెలిపారు. ఆ సమయంలో అతడు అక్కడికి ఎందుకు వెళ్లాడు? ఏ పని కోసం వెళ్లాడు? అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన సమయంలో విధుల్లో వీఆర్ఏలు ఉన్నారని చంద్రబాబుకు తెలిపారు అధికారులు. ఘటనా స్థలానికి పోలీస్ జాగిలాలు వెళ్లాయా? ఉదయం నుంచి ఏం విచారణ చేశారని అధికారులు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపైనా చంద్రబాబు ప్రశ్నించారు. ఘటన జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైన విచారణ జరపాలని, సీసీ కెమెరాలో ఫుటేజీని వెంటనే హ్యాండోవర్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డేటా సేకరించాలని సూచించారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలను అధికారులు మర్చిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాఫ్తు జరపాలన్నారు. ఈ ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది? అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :