Friday, 14 November 2025 01:53:03 PM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

AP : ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.. భారీ వర్షాలు కురిసే అవకాశం

Date : 03 September 2024 11:29 AM Views : 174

Studio18 News - ANDHRA PRADESH / : Vijayawada Flood : గత మూడు రోజులుగా ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీనికితోడు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు, కృష్ణా నదిలోకి వరద నీరు పోటెత్తింది. బుడమేరులోకి గతంలో ఎప్పుడూలేని స్థాయిలో వరదనీరు చేరడంతో విజయవాడలోని పలు డివిజన్లలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇల్లు మునిగిపోగా.. పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ లలోకి పెద్దెత్తున వరదనీరు చేరింది. వరదల్లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వం ఆహారం, తాగునీరు అందిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులుగా రాత్రిపగలు తేడాలేకుండా వరద ముంపు ప్రాంతాల్లో బోట్లలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని బోటుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి వరద ముంపు ప్రాంతాలు కొద్దికొద్దిగా తేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు ఆందోళన కలిగించే వార్తను వాతావరణ శాఖ తెలిపింది. ఏపీకి తుఫాన్ ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశంఉందని, ఇది తుపానుగా మారి విశాఖ – ఒడిశా దిశగా ప్రయణించి తీరందాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో బలహీనపడిన వాయుగుండం తూర్పు విదర్భ, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతుంది. అల్పపీడనం రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు 19మంది మరణించగా, ఇద్దరు గల్లంతైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. 136పశువులు మృతి చెందినట్లు తెలిపింది. 1,72,542 హెక్టార్ల వరి, 14,959 హెక్టార్ల ఉద్యాన పంటలు, 1,808KM మేర రోడ్లు నాశనమైనట్లు పేర్కొంది. 176 పునరావాస కేంద్రాలకు 41,927మందిని తరలించామని, బాధితులకు మూడు లక్షల ఆహార ప్యాకెట్లు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లకు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :