Wednesday, 26 March 2025 04:18:28 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

MBBS: ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్ విడుదల

Date : 15 August 2024 12:20 PM Views : 57

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో 2024 -25 విద్యాసంవత్సరానికి గానూ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కు యాజమాన్య కోటా కింద ప్రవేశాలు కల్పించేందుకు గానూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నిన్న నోటిపికేషన్ విడుదల చేసింది. గత ఏడాది ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్, స్విమ్స్ లో ఎంబీబీఎస్ సీట్ల ఎన్ఆర్ఐ కోటాలో ఈ నోటిఫికేషన్ కింద ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ యూజీ - 2024 లో అర్హత సాధించిన విద్యార్ధులు ఈ నెల (ఆగస్టు) 21వ తేదీ రాత్రి 9 గంటల వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆగస్టు 16వ తేదీ రాత్రి 7 గంటల నుండి ఆగస్టు 18వ తేదీ రాత్రి 9 గంటల వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉండదని యూనివర్శిటీ తెలిపింది. ఈ వ్యవధిలో కన్వీనర్ కోటా కింద ప్రవేశాల కోసం ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రుసుము చెల్లింపు ఇలా యాజమాన్య కోటా సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్ధులు రూ.10,620లు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుము రూ.30,620లతో ఆగస్టు 21వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలు తలెత్తితే 89787 80501, 79977 10168 నెంబర్ లకు, సాంకేతిక సమస్యలు తలెత్తితే 90007 80707 నెంబర్ లకు సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. సీట్ల విషయానికి వస్తే.. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద 225 సీట్లు, ఎన్ఆర్ఐ కోటా కింద 95 సీట్లు చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సిమ్స్ లో 23, ఎన్ఆర్ఐ ప్రైవేటు, మైనార్టీ మెడికల్ కళాశాలల్లో 1,078 బీ కేటగిరి, 472 ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. డెంటల్ కళాశాలలో 489 బీ కేటగిరి, 211 ఎన్ఆర్ఐ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :