Thursday, 12 March 2026 03:21:32 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

MBBS: ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్ విడుదల

Date : 15 August 2024 12:20 PM Views : 298

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో 2024 -25 విద్యాసంవత్సరానికి గానూ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కు యాజమాన్య కోటా కింద ప్రవేశాలు కల్పించేందుకు గానూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నిన్న నోటిపికేషన్ విడుదల చేసింది. గత ఏడాది ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్, స్విమ్స్ లో ఎంబీబీఎస్ సీట్ల ఎన్ఆర్ఐ కోటాలో ఈ నోటిఫికేషన్ కింద ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ యూజీ - 2024 లో అర్హత సాధించిన విద్యార్ధులు ఈ నెల (ఆగస్టు) 21వ తేదీ రాత్రి 9 గంటల వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆగస్టు 16వ తేదీ రాత్రి 7 గంటల నుండి ఆగస్టు 18వ తేదీ రాత్రి 9 గంటల వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉండదని యూనివర్శిటీ తెలిపింది. ఈ వ్యవధిలో కన్వీనర్ కోటా కింద ప్రవేశాల కోసం ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రుసుము చెల్లింపు ఇలా యాజమాన్య కోటా సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్ధులు రూ.10,620లు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుము రూ.30,620లతో ఆగస్టు 21వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలు తలెత్తితే 89787 80501, 79977 10168 నెంబర్ లకు, సాంకేతిక సమస్యలు తలెత్తితే 90007 80707 నెంబర్ లకు సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. సీట్ల విషయానికి వస్తే.. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద 225 సీట్లు, ఎన్ఆర్ఐ కోటా కింద 95 సీట్లు చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సిమ్స్ లో 23, ఎన్ఆర్ఐ ప్రైవేటు, మైనార్టీ మెడికల్ కళాశాలల్లో 1,078 బీ కేటగిరి, 472 ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. డెంటల్ కళాశాలలో 489 బీ కేటగిరి, 211 ఎన్ఆర్ఐ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :