Monday, 23 June 2025 02:27:32 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను గుర్తుచేస్తూ గంటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్స్

Date : 08 August 2024 01:43 PM Views : 117

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ఓటర్లు ఎన్నికల్లో అద్భుత తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడేలా చేశారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. లేదంటే బంగ్లాదేశ్, శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు చూశామో ఏపీలోన ఎన్నికలు ఆలస్యమైతే అదే పరిస్థితి చూసే వాళ్లమని తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. తాము సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని, ఈ రెండు రాష్ట్రానికి ప్రధాన ప్రాజెక్టులని చెప్పారు. పోలవరం విషయంలో విదేశీ నిపుణులు తో సంప్రదింపులు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీద 7 శ్వేతపత్రాలు ఇచ్చామని, వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుపుతున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల శాసన సభ్యుడు మాత్రమేనని, మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు వస్తేనే ప్రతి పక్ష నేత హోదా ఉంటుందని అన్నారు. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలో కూటమి పదికి పది గెలవడం హర్షనీయమని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భారీ మెజారిటీతో స్థాయి సంఘం గెలిచామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఏ ఎన్నిక అయినా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని చెప్పారు. వైసీపీ మునిగిపోయే నావ అని అన్నారు. ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, తాడేపల్లిలో జగన్ నైతికత, విలువలు అంటూ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తునట్టు ఉందని చెప్పారు. వైసీపీకి మెజార్టీ ఉంటే ఎన్నికకు ఎలా వెళ్తారని కూటమిపై విమర్శలు చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎలా బెదిరించి గెలిచారో అందరికి తెలుసని చెప్పారు. ఏపీ ఓటర్లు ఎన్నికల్లో అద్భుత తీర్పు ఇచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యేలా చేశారని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :