Wednesday, 25 June 2025 07:54:29 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Nara Lokesh: ఏజెంట్ చేతిలో చిక్కి సౌదీలో నరకం.. లోకేశ్ చొరవతో హైదరాబాద్ చేరుకున్న కోనసీమ వాసి

Date : 26 July 2024 01:13 PM Views : 142

Studio18 News - ANDHRA PRADESH / : నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దేశం కాని దేశంలో దుర్భర జీవితం అనుభవిస్తున్న కోనసీమ జిల్లా యువకుడిని మంత్రి నారా లోకేశ్ కాపాడారు. జిల్లాలోని ఇసుకపూడికి చెందిన వీరేంద్రకుమార్ ఏజెంట్‌ను నమ్మి మోసపోయాడు. ఖతర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటెల మధ్య పడేశారు. అక్కడ దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక అనారోగ్యం పాలైన వీరేంద్ర కుమార్ ఇటీవల ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఏజెంట్ చేతిలో చిక్కి మోసపోయానని, తానీ దురవస్థ అనుభవించలేనని, తనను రక్షించాలని వేడుకున్నాడు. ఆ వీడియో చూసి స్పందించిన మంత్రి నారా లోకేశ్.. వీరేంద్రకుమార్‌కు ధైర్యం చెప్పారు. స్వస్థలానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని, ఆ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. లోకేశ్ ఆదేశాలతో వీరేంద్రకుమార్‌ను స్వస్థలానికి తరలించే ఏర్పాట్లను టీడీపీ ఎన్ఐఆర్ విభాగం తీసుకుంది. ఈ క్రమంలో వీరేంద్ర కుమార్ ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. సోదరి లక్ష్మి, కుటుంబ సభ్యులు, స్నేహితులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇసుకపూడికి బయలుదేరారు. తనను కాపాడిన మంత్రి లోకేశ్, టీడీపీ ఎన్నారై విభాగానికి వీరేంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :