Wednesday, 12 November 2025 04:57:39 AM
# Shaheen: మా అమ్మాయి ఉగ్రవాదా?... నమ్మలేకపోతున్నాను!: డాక్టర్ షాహీన్ తండ్రి ఆవేదన # Ajith Kumar: సినీ నటుడు అజిత్ ఇంటికి, కాంగ్రెస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు # Ambati Rambabu: ఓ మై గాడ్... నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ # Bharati Dixit: ఐఏఎస్ అయిన నా భార్త వేధిస్తున్నాడు.. కిడ్నాప్ కూడా చేశాడు: ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు # Chandrababu Naidu: అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్... ఏపీ సమస్యలు వివరించిన సీఎం చంద్రబాబు # Jubilee Hills Bypoll: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం # Chhattisgarh Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... ఆరుగురు మావోయిస్టుల మృతి # Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు # Bihar Elections: బీహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం... ముక్తకంఠంతో చెబుతున్న ఎగ్జిట్ పోల్స్‌! # Amit Shah: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన... అధికారులకు అమిత్ షా ఆదేశాలు # India Russia Relations: భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు # Sanju Samson: సంజూ శాంసన్‌కు సీఎస్‌కే బర్త్‌డే విషెస్.. ఆ మెగా డీల్‌పై స్పష్టమైన సంకేతమా? # Delhi Blast: ఢిల్లీని వణికించిన కారు.. చాలా చేతులు మారిందా?.. దర్యాప్తులో కీలక విషయాలు # Delhi blast: పట్టుబడతాననే భయంతోనే.. ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! # Naseem Shah: పాక్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు # HR Department: హెచ్‌ఆర్ పొరపాటు.. సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్! # Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా కేసు.. ఫిల్మ్‌నగర్‌లో కలకలం # Hijras: కొత్త ఇల్లు కడితే రూ.లక్ష ఇవ్వాలట.. అంత ఇవ్వలేనన్న వ్యక్తిపై హిజ్రాల దాడి # Maganti Sunitha: జూబ్లీహిల్స్‌లో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఫైర్.. 14న చూసుకుందామంటూ వార్నింగ్‌! # Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ గాయంపై సంచలన విషయాలు.. అప్పుడు ఆక్సిజన్ 50కి పడిపోయింది!

విజయవాడలో వరదలు.. నారా లోకేశ్ కీలక ప్రతిపాదన.. అంగీకారం తెలిపిన మంత్రులు

Date : 03 September 2024 10:28 AM Views : 229

Studio18 News - ANDHRA PRADESH / : Vijayawada Floods: భారీవర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చిన వరద కారణంగా బుడమేరు, కృష్ణా నది ఉప్పొంగాయి. దీంతో విజయవాడలోని అనేక కాలనీలు వరద ముంపులో చిక్కుకుపోయాయి. మోకాళ్లలోతు నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు సహాయక చర్యల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. విజయవాడలో సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు విత్ డ్రా చేసుకోవాలని మంత్రి లోకేశ్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను మంత్రులు అంగీకరించారు. వరద నేపథ్యంలో ఆ వాహనాలను సహాయక చర్యలకు వినియోగించాలని నిర్ణయించారు. దీంతో నిత్యావసర వస్తువులు, భోజనం, తాగునీరు అందించే వాహనాలుగా ఎస్కార్ట్ మంత్రుల వాహనాలు వెళ్లనున్నాయి. అర్ధరాత్రి రేపల్లె మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గండి పడుతుందేమో అనే భయంతో రాత్రంతా కరకట్ట మీదే మంత్రులు కాపలాకాశారు. బలహీనపడిన రావి అనంతవరం కరకట్టను మంత్రులు పరిశీలించారు. పెనుమూడి ఘాట్ వద్ద వరద ఉధృతిపై అధికారులను మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జలదిగ్భందం అయిన పెనుమూడి, పల్లెపాలెం నిర్వాసితులతో మాట్లాడి అండగా ఉంటామని వారికి మంత్రులు భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :