Saturday, 07 March 2026 08:02:56 PM
# ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు # జగిత్యాలపై చిన్నచూపు ఎందుకు..?

Vidadala Rajini: మాజీమంత్రి విడదల రజని వేధిస్తున్నారు.. గ్రీవెన్స్‌లో బాధితుడి ఫిర్యాదు

Date : 10 August 2024 11:59 AM Views : 302

Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని తనను వేధిస్తున్నారని పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన కోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు వచ్చిన ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రజని తన మరిది గోపీనాథ్ పేరుతో తమ వద్ద మూడెకరాల భూమి కొనుగోలు చేశారని, ఇంకా రూ. 25 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రేపు, మాపు అని చెబుతూ వేధిస్తున్నారని కోటయ్య పేర్కొన్నారు. అలాగే, వైసీపీ బాధితులు మరికొందరు కూడా ఈ గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు సమర్పించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గత ప్రభుత్వం తమపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని, కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, గత ప్రభుత్వం రద్దు చేసిన పింఛన్లను పునరుద్ధరించాలని, రేషన్‌కార్డులు ఇవ్వాలని పలువురు వేడుకున్నారు. తాము 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేశారని, పొలంలో అడుగుపెడితే నరికేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని పల్నాడు జిల్లా బొల్లాపల్లికి చెందిన మహిళలు విజయనిర్మల, మేరీ వినతిపత్రం సమర్పించారు. తాము టీడీపీ వాళ్లమనే కక్షతో తమ కుటుంబపై గత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని నెల్లూరు జిల్లా దగదర్తికి చెందిన పవన్‌కుమార్ ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్‌కు హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు వినతులు స్వీకరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :