Monday, 17 February 2025 04:01:48 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

AP Govt: పింఛ‌న్ల పంపిణీలో కీల‌క మార్పు దిశ‌గా ఏపీ స‌ర్కార్ అడుగులు

Date : 05 September 2024 12:18 PM Views : 50

Studio18 News - ANDHRA PRADESH / : పింఛ‌న్ల పంపిణీలో కీల‌క మార్పు దిశ‌గా ఏపీలోని కూట‌మి స‌ర్కార్ అడుగులేస్తోంది. ఈ మేర‌కు తాజాగా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొంత‌కాలంగా సామాజిక పింఛ‌న్ల పంపిణీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌కలకు ఆస్కారం లేకుండా స‌రికొత్త పధ్ధతితో ముందుకు వ‌స్తోంది. దీనిలో భాగంగా ప్ర‌భుత్వం అత్యాధునిక ఎల్ ఆర్‌డీ (రిజిస్ట‌ర్డ్‌) ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికోసం రూ. 53కోట్ల‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌య శాఖకు కేటాయించింది. దీంతో ఏపీ స‌ర్వీసెస్ టెక్నాల‌జీ ద్వారా డివైజ్‌ల కొనుగోలుకు రాష్ట్ర స‌చివాల‌యాల శాఖ టెండ‌ర్లు ఆహ్వానించింది. అక్టోబ‌ర్ నుంచి 1.34ల‌క్ష‌ల కొత్త స్కాన‌ర్ల‌తో పింఛ‌న్ల పంపిణీ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం వినియోగంలో ఉన్న ఎల్ఓ ఆర్‌డీ స్కాన‌ర్ల‌లో సెక్యూరిటీ ప‌రంగా లోపాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాంతో న‌కిలీ వేలి ముద్ర‌ల‌ను ఉప‌యోగించి పింఛ‌న్లు స్వాహా చేస్తున్నార‌నే ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వాటికి అడ్డుక‌ట్ట వేసేందుకే కూట‌మి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇక పింఛన్ల బ‌దిలీ కోసం ప్ర‌భుత్వం సంబంధిత వెబ్‌సైట్‌లో ప్ర‌త్యేక ఆప్ష‌న్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి పింఛ‌న్ బ‌దిలీ కోసం ద‌ఖాస్తుదారులు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్క‌డ పింఛ‌న్ ఐడీ, ఏ ప్రాంతానికి బ‌దిలీ చేయాల‌నుకుంటున్నారో ఆ జిల్లా, మండ‌లం, సచివాల‌యం వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలి. ఇలా చేయ‌డం ద్వారా స్వ‌గ్రామాల‌కు రాలేనివారు తాము ఉంటున్న ప్రాంతాల్లోనే పింఛ‌న్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు