Saturday, 24 January 2026 02:28:49 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

వారి కుటుంబాలకు 10వేలు..! ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Date : 09 August 2024 09:56 AM Views : 304

Studio18 News - ANDHRA PRADESH / : Organ Donors : బ్రెయిడ్ డెడ్ తో మరణించి అవ‌య‌వదానం చేసిన దాత‌ల భౌతిక కాయాలకు అధికార లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది. జిల్లా క‌లెక్ట‌ర్ లేదా సీనియ‌ర్ అధికారి అంతిమ సంస్కారంలో పాల్గొనాలని‌ ఆదేశించింది. అవ‌య‌వ దాత‌ల కుటుంబాల‌కు పారితోషికంగా రూ.10 వేలు ఇవ్వనున్నారు. అలాగే ప్ర‌శంసా ప‌త్రాలు అందించాలని మార్గదర్శకాలు జారీ చేసింది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌. అవయవ సేకరణ అనంతరం ఆసుపత్రి నుంచి భౌతిక కాయాన్ని ఉచితంగా తరలించనున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడాలి- సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ, ఆస్పత్రుల పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఓపెన్ మార్కెట్ తో పోటీ పడేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయాలన్నారు. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని, సామాన్యుడు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగ్గ వైద్యం అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ”కార్పొరేట్ ఆస్పత్రులు లాభాలు ఆశించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పుడు మనం ఏ లాభం లేకుండా కేవలం సేవ చేస్తున్నప్పుడు ఎందుకు మెరుగైన వైద్యం అందించలేకపోతున్నాం? ఈ అంశంపై అధికారులు దృష్టి సారించాలి. ఇన్సూరెన్స్ కూడా అందరికీ యూనిఫామ్ గా పెట్టాలి. ప్రైవేట్ ఆస్పత్రులతో మనం ఎందుకు పోటీపడలేం? రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడాలి. ఇది సవాల్ గా తీసుకొని అధికార యంత్రాంగం పని చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వసతులు, విశాలమైన స్థలం అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :