Monday, 23 June 2025 03:44:29 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

Pawan Kalyan: చంద్రబాబు అనుభవజ్ఞుడు.. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది: కలెక్టర్ల సమావేశంలో పవన్

Date : 05 August 2024 01:10 PM Views : 124

Studio18 News - ANDHRA PRADESH / : అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు గురువని, ఆయన నుంచి తనలాంటి వారు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని పవన్ పేర్కొన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసే వారు ఉంటే ఆ వ్యవస్థ బాగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. నేర్చుకోవాలనుకునే తపన ఉన్న తనలాంటి వారందం కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. చంద్రబాబు విజన్‌ను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. విభజన వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామని, అవమానాలు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. సీఎం చెబుతున్న స్కిల్ సెన్సెస్‌కు సలహాలు, సూచనలు అవసరమని వివరించారు. రాష్ట్రం వికసిస్తేనే భారత్ సూపర్ పవర్ 97 శాతం స్ట్రైక్ రేట్‌తో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్న జనసేనాని.. ఒకవేళ ఈసారి అధికారంలోకి రాకపోయినా కూడా ప్రజాస్వామ్యంలో నిలబడి వ్యవస్థను బలోపేతం చేయాలని అనుకున్నట్టు చెప్పారు. తమది బాధ్యతాయుత ప్రభుత్వమని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో చెప్పేందుకు గత ఐదేళ్లలో రాష్ట్రం ఉదాహరణగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశామని, గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పిఠాపురంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను పైలట్ జెక్టుగా చేపడుతున్నట్టు పవన్ తెలిపారు. 2047 నాటికి భారత్ సూపర్ పవర్ కావాలంటే రాష్ట్రం వికసిత ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అవసరం ఉందని పవన్ నొక్కి చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :