Monday, 24 March 2025 06:12:09 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు సర్కారు సిద్ధం

Date : 02 September 2024 04:46 PM Views : 79

Studio18 News - ANDHRA PRADESH / : వరద ముంపు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన కొనసాగుతోంది. యనమలకుదురుతో పాటు పటమట, రామలింగేశ్వర నగర్, జక్కంపూడిలో ఆయన పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ దిగువ, ఎగువ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడి పర్యటన జరిగింది. వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో, బురదలో చంద్రబాబు నాయుడు కాలినడకన వెళ్తూ ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ఇంకా ఎక్కువ లోతు ఉన్న ప్రాంతాల్లో బోట్ ద్వారా నేరుగా బాధితుల వద్దకు వెళ్తున్నారు. వరద ప్రాంతాల బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని అధికారులకు చెప్పి అప్పటికప్పుడు పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నారు. అంతేగాక, వరద ఉద్ధృతి, ముంపు నివారణ చర్యలను క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతోంది సర్కార్. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఫుడ్ బాస్కెట్స్ తీసుకెళ్లే విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ విధానాన్ని చంద్రబాబు నాయుడికి ఐ అండ్ ఐ సెక్రటరీ సురేశ్ కుమార్ వివరించారు. 8-10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల సరఫరా చేయొచ్చని సురేశ్ తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :