Tuesday, 11 November 2025 04:24:13 PM
# Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం # Ande Sri: అందెశ్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన # Rajyalaxmi: అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. ఆదుకునేందుకు కదిలిన ప్రవాస భారతీయులు # Nara Lokesh: ఇది కల్తీ కాదు... హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి: మంత్రి నారా లోకేశ్ # Stock Market: ఐటీ, ఆటో షేర్ల జోరు... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ # Pakistan: నేపాల్, బంగ్లాదేశ్‌లలో... భారత్ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్ కుట్ర # Harish Rao: రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటేయాలో ముందే నిర్ణయించుకున్నారు: హరీశ్ రావు # Kommareddi Pattabhiram: రసాయన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్ధించుకుంటారా?: వైసీపీపై పట్టాభి ఫైర్ # Sri Bharat: బుద్ధి చెప్పినా వైసీపీ నేతలు మారలేదు.. పెట్టుబడుల సదస్సును అడ్డుకోవాలనుకుంటున్నారు: శ్రీభరత్ 10 # Chandrababu Naidu: అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్... సీఎం చంద్రబాబు కీలక సమీక్ష # Meena: మిథున్ చక్రవర్తి సినిమా చేయమని అడిగితే భయపడ్డా.. ఆయన హోటల్‌కే వెళ్లలేదు: నటి మీనా # Khushboo Ahirwar: సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పద మృతి # Chandrababu Naidu: మంత్రులను ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు # Sunil Gavaskar: ఆ నగదు అందకపోతే నిరాశవద్దు: మహిళా జట్టుకు సునీల్ గవాస్కర్ కీలక సందేశం # Ambati Rambabu: తిరుమల అన్నప్రసాదంపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మీడియాపై అంబటి ఫైర్ # Nalgonda: నల్గొండ జిల్లాలో ఉల్లిపాయల లారీ బోల్తా.. బస్తాలను ఎత్తుకెళ్లిన వాహనదారులు # 'మహారాణి 4'( సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ! # Nadenla Manohar: ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల సమీక్ష... గోడౌన్లు సిద్ధం చేయాలని ఆదేశం # Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై వార్తలను ఖండించిన నటుడి టీమ్ # Mahesh Babu: మహేశ్ బాబు-రాజమౌళి చిత్రం... 50 వేల మందితో అత్యంత భారీ ఈవెంట్

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ నేతల కీలక భేటీ

Date : 28 August 2024 12:41 PM Views : 223

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర నెలలు దాటింది. ఇక నామినేటెడ్ పదవులపై తెలుగు తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కీలక నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న ఆశతో ఉన్నారు. అయితే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న జనసేన, బీజేపీ నేతలు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల నియామకాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ తరుణంలో బీజేపీ కీలక నేతలు మంగళవారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం చంద్రబాబుతో బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు కూటమిలో నెలకొన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అలానే నామినేటెడ్ పదవుల్లోనూ బీజేపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం. చంద్రబాబుతో భేటీకి ముందు విజయవాడలోని పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీ సీఎం రమేశ్, రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, విప్ ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ పార్థసారథి, ఎన్ ఈశ్వరరావు, రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ తదితరులు పురందరేశ్వరి నివాసంలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవులు, జిల్లాల వారీగా ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :