Wednesday, 25 June 2025 06:40:16 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటివద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత.. నేను ఉండలేను డైవర్స్ తీసుకుంటానన్న శ్రీనివాస్

Date : 10 August 2024 10:59 AM Views : 124

Studio18 News - ANDHRA PRADESH / : Duvvada Family Controversy : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద శుక్రవారం అర్థరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కవరం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి రాత్రి 11గంటల సమయంలో పెద్దకుమార్తె హైందవితోకలిసి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి, టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి వెళ్లారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచే ప్రయత్నం చేశారు. గేట్లు తెరుచుకోక పోవడంతో క్యాంపు కార్యాలయం డోర్లను కట్టర్లతో కట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దెత్తున దువ్వాడ నివాసం వద్దకు చేరుకొని ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భార్య, కుమార్తె అర్థరాత్రి తన ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్.. ఆయన సోదరుడు, అనుచరులతో కలిసి నివాసానికి వచ్చాడు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి వస్తూనే భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ, అతని సతీమణి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికిలోనైన దువ్వాడ శ్రీనివాస్ ఆయన సతీమణిపై దాడికి యత్నించాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు దువ్వాడను అడ్డుకొని వాణికి రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు శ్రీధర్, మరోవైపు దువ్వాడ వాణి, హైందవిల మధ్య తీవ్ర వాదోపవాదనలు కొనసాగాయి. క్యాంపు కార్యాలయం ఖాళీచేసి వెళ్లిపోవాలని దువ్వాడ వాణి పట్టుబట్టింది. అయితే, ఈ కార్యాలయం తాను కట్టించిందని దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు చెప్పాడు. దీంతో ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వాణిని లోపలికి రానివ్వకపోవటంతో క్యాంప్ కార్యాలయం ఖాళీ చేసే వరకు ఇక్కడే ఉంటానంటూ క్యాంప్ కార్యాలయం బయటనే దువ్వాడ వాణి నిద్రించారు. ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి వాణి తల్లిదండ్రులు చేరుకొని దువ్వాడ శ్రీనివాస్ తో వాగ్వివాదానికి దిగారు. ఏ హక్కుతో మాధురి తన భర్తతో ఉంటుందని దువ్వాడ వాణి ప్రశ్నించారు.. ఆయన వల్ల తాను డబ్బుతోపాటు పేరును పోగొట్టుకున్నానని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :