Wednesday, 30 April 2025 08:00:25 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

corporators: వైసీపీకి విశాఖపట్నం కార్పొరేటర్ల షాక్

Date : 07 August 2024 11:20 AM Views : 83

Studio18 News - ANDHRA PRADESH / : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్ లు ఆ పార్టీకి షాక్ ఇచ్చి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు పార్టీ అధినేత, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జీవీఎంసీ 42,43,47,59,77వ వార్డు కార్పొరేటర్ లతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్ లు, కనకమహాలక్ష్మి ఆలయ మాజీ చైర్మన్ కర్రిపోతుల ప్రసాద్, లోక్ సత్తా జోనల్ మాజీ నాయకుడు మంచిపల్లి సత్యనారాయణ తదితరులు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. ఎన్నికల తర్వాత మొట్టమొదటి రాజకీయపరమైన చేరికలు ఇవి అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ నుంచి చేరికలు మొదలు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున బలంగా విజయం సాధించే విధంగా అంతా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం విశాఖలో కాలుష్య సమస్య చాలా ఎక్కువగా ఉందని, దేశంలోనే వాయు, జల కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరంగా విశాఖ ఉందని అన్నారు. కార్పొరేటర్లుగా కాలుష్య నియంత్రణ బాధ్యత వారిపై ఉందని చెప్పారు. పర్యావరణ శాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి తన పరిధిలో ఉందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ సూచించారు. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :