Saturday, 17 January 2026 10:00:16 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

వాళ్లు నా పట్ల నీచంగా ప్రవర్తించారు.. నా కేసును రాజకీయాలతో ముడి పెట్టకండి : నటి కాదంబరీ జత్వానీ

Date : 09 September 2024 04:36 PM Views : 274

Studio18 News - ANDHRA PRADESH / : Kadambari Jethwani : కొందరు ఐపీఎస్ అధికారులు నాపట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరీ జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో అక్రమంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆనాటి పోలీసు అధికారులు విద్యాసాగర్ కు ఎందుకు కొమ్ముకాశారని ప్రశ్నించారు. వరదల వల్ల పోలీసులు చాలా బిజీగా మారిపోయారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉందని జత్వానీ అన్నారు. నాపై సోషల్ మీడియాలో నీచంగా ప్రచారం చేస్తున్నారు. నా కేసును రాజకీయాలతో ముడి పెట్టకండి. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వారికి శిక్ష పడేలా చూడండని విజ్ఞప్తి చేశారు. నాకు అండగా నిలిచిన మహిళా సంఘాలందరికీ జత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంఘం నేత దుర్గా భవాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు భారతదేశంలో కూడా మొత్తం ఈ కేసు గురించి తెలుసు. ఈ జత్వాని కేసులో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరికీ తెలుసు. స్పెషల్ ప్లైటులో ముంబై వెళ్లి నటి జత్వానిని తీసుకొచ్చారంటే ఎంత పలుకుబడి ఉపయోగించారో మనమందరం తెలుసుకోవచ్చు. పొలిటికల్ ఎంక్వాయిరీ అనేది ఎంత వరకు కరెక్ట్? జ్యుడీషియల్ ఎంక్వెయిరి వేయాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. పారిశ్రామిక వేత్త ఎక్కడో ముంబైలో ఉండి ఆమెని లొంగతీసుకున్నారు. అనేక రకాలుగా వేధించి ఇబ్బందులకు గురిచేశారు. ఆనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని ఒక మహిళను ఎన్నో రకాలుగా చిత్ర హింసలు చేశారు. జత్వాని అరెస్టు వెనక పెద్ద కుట్ర దాగిఉంది. సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి రాష్ట్రానికి తీసుకొచ్చారు. జత్వాని కేసు మీద జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా న్యాయం చేయాలి. ఇంత వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. జత్వానికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలిసి మద్దతు తెలుపుతున్నాం. దోషులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపర్చాలని సుంకర పద్మశ్రీ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :